వాటి కయన మంటే అధిష్ఠానం లేదా ఆధారం నారాయణ. అలాగే మా అంటే నామరూపాత్మకంగా విస్తరించిన పరమాత్మ విభూతి. దానికి ధవ అధిపతి మాధవ. పరమాత్మ స్వరూపమే. ఇలా కేశవాది నామాలు ప్రతి ఒక్కటీ త్రిమూర్తులను గాక వాటికి మూలమైన అమూర్తమైన పరతత్త్వాన్నే మనకు చెబుతున్నది.
అయితే మరి మూడు నామాలే చెప్పి ఆచమనం చేస్తున్నామే. మిగతా నామాల మాటేమిటి. మూడే చాలు. మిగతా ఇరవయి ఒక్క నామాలకూ అది ఉపలక్షణం Indicative. కారణమంటే మనకున్నవి మూడే కరణాలు. అవి మనో వాక్కాయాలు. అవి శుద్ధి కావాలి మొదట ఏ కర్మ నాచరించటానికైనా. అవి మూడూ శుద్ధి అయితే వాటి ద్వారా చేసే కర్మలన్నీ శుద్ధి అయినట్టే. అందుకే మిగతా నామాలు మామూలుగా ఉచ్చరించినా మొదటి మూడు నామా లుచ్చరిస్తున్నప్పుడే ఆచమనం చేస్తుంటాము. చేస్తే అది స్వాహా అయి పోతుంటుంది. అంటే లోపల ఆహుతి అయిపోతుంది. చేరిపోతుంది. జలం శరీరంలో చేరిపోయినా తద్వారా పరమాత్మ భావం మన మనసులో చేరిపోతున్నదని భావన.
ఈ నామాలలో మొట్టమొదటిది కేశవ అని గదా చెప్పాము. అది త్రిమూర్తులకు సంకేతమని గదా పేర్కొన్నాము. పోతే త్రిమూర్తులు త్రిగుణాలకు సంకేతం. త్రిగుణాత్మకమైనది ఈశ్వర ప్రకృతి. అది ఆయనతో అవినాభూతంగా ఉన్న మాయా శక్తే.
Page 21