అలాగే బాహ్యంగా పృధివ్యాది భూత పంచకమూ శారీరకంగా శిరో ముఖ నేత్ర హృదయ కరతల కరపృష్ఠాదులూ - దశదిశలూ - గంగా యమునాది పుణ్యనదీ ప్రాంతాలూ అంతేగాక మనం నివసించే ప్రదేశమూ గృహమూ ఇలాంటి వన్నీ స్మరిస్తున్నా మంటే అది పృధివికి సంబంధించింది. సంబంధించిన దంటే ఇదే పరమార్ధమని ఇక్కడికే ఆగిపోవటం కాదు. ఇవి మూడూ ఆ పరమాత్మ తాలూకు ఏ మహాశక్తి ఉందో దాని వ్యక్తమైన రూపాలే నని గ్రహించి వీటి ద్వారా మనమా మూలభూతమైన పరమాత్మ తత్త్వాన్ని భావించాలని అర్ధం. భావనలోనే పడిపోయాము కాబట్టి మరలా భావన తోనే పైకి లేవాలి. పరమాత్మను తేజోబన్నాలుగా భావన చేయటం పడి పోవటమైతే మనకందు బాటులో ఉన్న ఈ తేజోబన్నా లేవోగా వా పరాశక్తి రూపాలే ఆశక్తి ఏదో గాదు మరలా ఆ పరమాత్మే ననే భావన పైకి లేవటం. పరాస్య శక్తి ర్వివి ధైవ శ్రూయతే అని చాటుతున్న దుపనిషత్తు. ఏక మనేక మయిందన్నారంటే మరలా ఈ అనేకాన్ని ఏకైకమైన తత్త్వంగా భావించమని ఉపదేశం. ఇదే అన్నేన సోమ్య శుంగేన - అద్భి స్సోమ్య శుంగేన అని ఛాందోగ్యం మన కుపదేశించటంలో ఉన్న ఆంతర్యం.
పోతే ఇంత గంభీరమైన అర్థాన్నంతటినీ లక్ష పొటెన్సీ హోమియో మాత్రలాంటి ఒక్క గాయత్రీ మంత్రంలో ఇమిడ్చి మనకందించారు మహర్షులు. విశ్వామిత్రులు వారు. విశ్వానికంతా హితైషులు. కనుకనే స్వయం తీర్థాః వరాంస్తార యంతి అన్నట్టు తాము ఉత్తీర్ణులయి మనలను కూడా ఉత్తీర్ణులను చేయటానికి తాపత్రయ పడ్డారు.
Page 152