అది తేజస్సును సృష్టించిందట మొదట తత్తేజ అపః తా ఆపః అన్న మని వరుసగా సృష్టి అయినాయి మూడూ. అయినా యంటే నిజంగా అయినాయని కూడా కాదు. పరమాత్మ శక్తే తేజస్సనే ఉపాధిగా జలమనే ఉపాధిగా అన్నం లేదా పృధివి అనే ఉపాధిగా ప్రకటమయి కనిపిస్తున్నాయని భావం. అప్పటికివన్నీ పరమాత్మే. వీటిని పట్టుకొని పోతే చాలు. పరమాత్మ దగ్గరికే తీసుకెళ్లి చేరుస్తాయి మనలను. ఈ తేజస్సే దైవతం – జలమే తీర్ధం - పృధివే క్షేత్రం. లోకంలో మనమొక క్షేత్రానికి పోయి అక్కడ ఒక తీర్థంలో స్నానం చేసి ఆ దేవుణ్ణి దర్శిస్తున్నా మంటే అందులో ఉన్న సంకేతమిదే. తేజోబన్నాలు మూడింటికీ దైవత తీర్ధ క్షేత్రాలు మూడూ కేవలం సంకేతాలు.
కనుకనే సంధ్యావందన ప్రక్రియ అంతా మొదటి నుంచీ చివర దాకా తేజస్సూ జలమూ పృధివీ ఈ మూడు తత్త్వాల తోనే ముడిబడి ఉంది. అనుష్ఠాన మంతా మూడింటితోనే సాగుతున్నది. సవితుర్వ రేణ్యమని - సూర్యశ్చమా అగ్నిశ్చమా అని ఆసత్యేన రజసా - హగ్ంస శ్శుచిషత్తని అంటూ సూర్యోప స్థానం చేస్తున్నా మంటే అదంతా తేజస్సుకు సంబంధించింది. అలాగే అపోహిష్ఠా మయోభువః హిరణ్య వర్ణా శ్శుచయః అని మాటి మాటికీ ఆచమనం చేస్తూ సూర్యుడి కర్ష్య ప్రదానం చేస్తూ ఉన్నా మంటే అదంతా జలానికి సంబంధించింది.
Page 151