#


Back

   అందుకోసమే ఈ గోత్రా చార్య స్మరణం అభివాదనం ఇదీ ఇందులో ఉన్న రహస్యం.

   ఇక్కడికి అంతా ముగిసింది గాయత్రీ ఆవాహనం దానికి మూలమైన సూర్యోప స్థానం - గాయత్రీ జపం. చివరకు గాయత్రీ శక్తి కధిష్ఠానమైన వాసుదేవ తత్త్వాను సంధానం. దాన్ని మనకందించే ఆచార్య పరంపరాభి వాదనం అంతా అయింది. సంధ్యా వందనమూ గాయత్రీ ఆవాహనోద్వాస నాదులూ అన్నీ సమస్త మయినాయి. పోతే ఇదంతా కర్మ కలాపమే. కర్మ కర్మగా మనల నుద్ధరించదు. అది జ్ఞానానికి దారి తీసి ఆ జ్ఞానం మన కొంట బట్టినప్పుడే పురుషార్ధ సిద్ధి. సర్వం కర్మా భిలం పార్ధ జ్ఞానే పరి సమాప్యతే - అన్నాడు కృష్ణ భగవానుడు. కనుక మనసా వాచా కర్మణా ఏది మనమెప్పుడు చేసినా అది ప్రకృతి విలాసమే కాబట్టి ఆ ప్రకృతి గుణాలతో సహా ఈ కర్మ కలాపమంతా ఆత్మజ్ఞానాగ్నిలో పూర్ణాహుతి చేసి పూర్ణ జ్ఞాన స్వరూపంగా మనలను మనం భావన చేయాలి. అప్పుడు నరులం కాము మనం. కేవలం నారాయణ స్వరూపులమే. ఆభావమే ఇప్పుడీ చివరి శ్లోకం బయట పెడుతున్నది. భగవద్గీతలో చరమ శ్లోకం వంటిదిది.

కాయేన వాచా మనసేంద్రియై ర్వా - బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ - కరోమి యద్యత్సకలం పరస్మై - నారాయణా యేతి సమర్పయామి -

Page 144