నమో బ్రహ్మణ్య దేవాయ - గో బ్రాహ్మణ హితాయ చ - జగద్ధితాయ - కృష్ణాయ - గోవిందాయ నమో నమః -
ఈ శ్లోక మింతకు ముందు రావలసినదైనా దాన్ని ఇక్కడ చెప్పుకొంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నిరపేక్షమైన తత్త్వమే సాపేక్ష మయిందని చెప్పాము. అమూర్తమే మూర్తమయిందని పేర్కొన్నాము. అమూర్తం పరమాత్మ చైతన్యమైతే మూర్తం దాని అవతారం. అవతారం లయంలో జరగదు. స్థితిలోనే జరుగుతుంది. కనుకనే శివుడవ తరించడు. విష్ణువే అవతారాలన్నీ ధరించేది. స్థితి కారుడాయనే గదా. అంచేత ఇక్కడ కృష్ణావతారాన్ని స్మరిస్తూ దానికే నమస్కృతి చెబుతున్నాడు. గోవిందాయ నమో నమః గాం వింద తీతి గోవిందః భూమి మీద అవతరించిన వాడని అర్థం. అలాంటి వాడికి నమః ఎందు కవ తరించాడు. ఎలా అవతరించాడు. జగద్ధితాయ కృష్ణాయ. జగత్తు కంతా మేలు చేయటానికి. జగత్తంటే జడమైన ప్రపంచం కాదు. చేతనమైనది. చేతనులలో కూడా అధికార సంపత్తి ఉన్నవారు. చెప్పిన దర్ధం చేసుకొని తామాచరించి ఇతరుల చేత ఆచరింప జేసేవారే అధికారులంటే Compe-tent గోబ్రాహ్మణ హితాయ గోబ్రాహ్మణులంటే వారే. గో వంటే ఇక్కడ విద్య. బ్రహ్మ విద్య దాన్ని అందుకొని సాధన చేసే వాడెవడో వాడు బ్రాహ్మణుడు.
Page 133