#


Index

   అందులో దశదిశలకూ నమస్కరిస్తున్నామంటే అది దేశమంతా పరమాత్మ భావనతో చూడటమే. త్రిసంధ్యలలో అలా నమస్కరిస్తున్నా మంటే కాలమంతా తదాకారంగా భావించటమే. అలాగే ఆ దేశకాలాల్లో నివసించే ఋషులకూ మునులకూ నమస్కారమంటే దాన్ని స్వానుభవానికి తెచ్చుకొన్న పాత్ర భూతులైన పెద్దలందరి సాహాయ్యాన్నీ అర్ధించటమే. వారిని కూడా బ్రహ్మ భావనతో దర్శించటమే.

   ఇదంతా ఎందుకోసం. బ్రహ్మ జ్ఞాన మార్జించి తద్వారా బ్రహ్మతత్త్వాన్ని మన స్వరూపంగా అనుభవానికి తెచ్చుకోటానికే గదా. అందుకే సంధ్యాయై నమః సావిత్ర్యై నమః - గాయత్ర్యైనమః - సరస్వత్యైనమః అంటున్నారు. సంధ్య ఆ బ్రహ్మ విద్యే. అదే సావిత్రీ రూపంగా మనదగ్గరికి వచ్చింది. సవన మంటే ప్రసవం. ఆ పరమాత్మ చైతన్యమే సవితృ ప్రకాశ రూపంగా వచ్చి మనకు బ్రహ్మాకార వృత్తి నందించింది. అలా అందించిన దాన్ని మరచిపోకుండా దాని గానం చేస్తూ పోతే అది గాయత్రి అయి మనలను కాపాడుతుంది. చివరకు దాని బలంతోనే ఉపాధిని వదిలేసి పోతే సరస్వతి అయి అది మనలనా బ్రహ్మ తత్త్వానికే చేరుస్తుంది. ఇలా మన జీవిత మాది మధ్యాంతాలు మూడు దశలలోనూ బ్రహ్మాకార వృత్తే మనకు శరణ్య మదే మనకాలంబనం. అందుకే దాని నాశ్రయించాలి అనుక్షణమూ. దానికి సంకేతమే ఈ సమస్కార మనే క్రియ. ఈ మార్గంలో పయనించి జీవిత లక్ష్యాన్ని సాధించి సిద్ధులైన దేవతలనేమిటి - ఋషులనేమిటి.

Page 116