#


Index

   వారి అనుగ్రహం సంపాదిస్తే వారిలాగే మనం కూడా పరమాత్మ తత్త్వాన్ని అందుకొనే మార్గం గ్రహించగలం. అందుకే గంగా యమునాది పుణ్య నదీ ప్రాంతంలో జ్ఞాతా జ్ఞాతంగా వసించే ఆ మహా మునులకు అభి వందనం సమర్పించాలి మనం. సమర్పిస్తే వారు మనకు దీర్ఘకాల జీవితాన్ని ప్రసాదిస్తారు. జీవే మ శరద శృతమని గదా అన్నారు. అర్ధాంతరంగా ముగియ కుండా దీర్ఘకాలం జీవించినప్పుడే ఏ గొప్ప కార్యమైనా సాధించగలడు మానవుడు - శరీర మాద్యంఖలు ధర్మ సాధన మన్నారు పెద్దలు.

   ధర్మమంటే ఏమిటి. ఎప్పుడూ మనలను ధరించి ఉండే దేదో అది ధర్మం. దాన్ని గుర్తించి మనం కూడా దాన్ని ధరించి ఉంటే అదీ ధర్మమే. ధర్మోరక్షతి రక్షితః అనే వాక్యానికిదే అంతరార్థం. అలాటి ధర్మం బ్రహ్మమే. అలాటి ధర్మం బ్రహ్మాకార వృత్తే. బ్రహ్మమెప్పుడూ మనలను వాటేసుకొనే ఉంది. వస్తుసిద్ధమది. దేశకాల వస్తువులన్నీ దాని స్వరూపమే. కాగా అలాటి సర్వవ్యాపకమైన తత్త్వాన్ని మానవుడు బుద్ధి సిద్ధం చేసుకోవా లెటు వచ్చీ. ఇప్పుడలా బుద్ధి సిద్ధం చేసుకొనే ప్రక్రియే ఈ నమస్కారం. నమస్కారం కేవలం కాయికమే కాదు. వాచికమే కాదు. మానసికం కూడా. మనసులో ఆ అఖండ వృత్తి ఏర్పడాలంటే దేశకాల పాత్రలనన్నిటినీ బ్రహ్మకారంగా భావన చేయాలి.

Page 115