కోవడం లేదు. కనుకనే తద్భిన్నంగా జీవులమై కూచున్నాము. అయినందుకు మనకేమిటి దాఖలా. మనలో ప్రతి ఒక్కడూ నాకు పరిపూర్ణమైన జ్ఞానముందని అనుభవానికి తెచ్చుకోలేక పోవడమే. అనుభవమేకదా దేనికైనా ప్రమాణం. అనుభవాన్ని ఎలా కాదనగలం. అజ్ఞానులమనే అనుభవం మనలో సహజంగానే చోటు చేసుకొని ఉంది.
దీనిని బట్టి అసలు మానవుడు జన్మ ఎత్తినప్పుడే అజ్ఞానంతో జన్మించాడని అర్ధమవుతున్నది. దీనికే మోహమని కూడా పేరు. ఈ మోహమొక అంధకారం లాంటిది. అది పుట్టుకతోనే మన అఖండ దృష్టిని ఆచ్చాదిస్తున్నది. అంతటితో ఊరుకోక ఇచ్చాద్వేషాలనే భావాలను రెచ్చగొట్టి నిర్వి కల్పమైన తత్త్వాన్ని సవికల్పంగా చూడటాని కలవాటు చేసింది. తన్మూలంగా నేను నాది అనే ద్వంద్వాల అనుభవం సంప్రాప్తమైంది. దాని వల్లనే ఈ ప్రపంచమంతా మన దృష్టికి బ్రహ్మమయంగా భాసించటానికి మారుగా బ్రహ్మమే ప్రపంచాకారంగా భాసిచసాగింది.
ఇదీ జరిగిన పెద్దమోసం. ఈ మోసానికేమిటి కారణం. మన అజ్ఞానం. ఎప్పటిదీ అజ్ఞానం. అనాది సిద్ధం. అది మనకెందుకేర్పడింది. మనం చేసుకున్న కర్మేదానికి కారణం. కారణం లేని కార్యమెప్పుడూ సంభవించదు. మన మీ జన్మలో అజ్ఞానంతో జన్మించామంటే మన మంతకుముందు చేసుకొన్నదే. మనం చేసుకొన్నది కాకుంటే అది మనలనెందుకు బాధించాలి. కర్మే అజ్ఞానాన్ని ప్రేరేపిస్తే ఆ అజ్ఞానం మనకు ద్వంద్వానుభవాన్ని ప్రసాదిస్తే అది మరలా మనచేత కర్మ చేయించి అజ్ఞానకూపంలో పడదోస్తున్నది.
45
యేషాం త్వoత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం !
తే ద్వంద్వ మోహ నిర్ముక్తా భజంతే మాం దృఢ ప్రతాః 7-28
కాబట్టి దీనికి ఆది ఏమిటని ప్రశ్నించి మరలా ప్రయోజనం లేదు. అది ఒక పరంపర. పూర్వపూర్వ వాసనయే ఉత్తరోత్తరానుభవానికి కారణమని చెప్పవలసి వస్తుంది. అన్నిటికీ పూర్వమేదని అడిగావో అసలు లేనేలేదు. పొమ్మని నోరు మూయిస్తుంది శాస్త్రం. ఈశ్వరుడి మాదిరి ఈ సంసారం కూడా అనాది సిద్ధం. "ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉ భావపి” అని కదా భగవానుడు చెప్పిన మాట.
Page 57