ఆ ప్రవృత్తి ధర్మాన్నే కేవలం ధర్మమనీ తరువాత శాస్త్రజ్ఞులూ లోకులూ వ్యవహరిస్తూ వచ్చారు.
పోతే ఈ ధర్మమోక్షాలే అసలు జీవిత గమ్యాన్ని చేర్చే సాధనాలు
గనుక వీటిని మనకు బోధించటమే కర్తవ్యంగా భావించారు మహర్షులు.
కధలూ పాత్రలూ సన్నివేశాలూ వారికి వివక్షితం Intention కాదు. కేవలం
వాటిని బోధించటాని కాలంబనంగా చేసుకొన్న ఒక సామగ్రి మాత్రమే.
అందులోనూ ధర్మ ప్రధానమైనది రామాయణమైతే మోక్షప్రధానమైనది
మహాభారతం. రాముడు కృష్ణుడు - వీరిద్దరూ ఒకరు ధర్మానికీ వేరొకరు
మోక్షానికీ ప్రతీకలు Symbols గా నిలబడతారు. నిలబడతారంటే ఎక్కడ
ఉన్నారా రామకృష్ణులు. వ్యాస వాల్మీకులు సృష్టించిన పాత్రలవి. తాము
దర్శించిన సత్యాన్ని తాముగా వాచ్యం చేసి చెబితే అది శాస్త్రమేగాని Science
కావ్యమని Art పెంచుకోదు. మానవుల మనస్సుల కది అంత రంజకంగా
ఉండదు. బాగా మనసుల కది హత్తుకోదు. కనుక ఆ భగవానుడి ద్వారానే
అందజేస్తే భయభక్తులతో వింటారు లోకులని భావించి ఉంటారా
మహానుభావులు. భగవానుడికీ లోకులకూ ఏమిటి సంబంధం. ఎక్కడో
దూరాన కూచొని ఆయనగారు బోధిస్తే మాత్ర మిక్కడెక్కడో భూమిమీద
నివసిస్తున్న మానవుడెలా వినగలడని సందేహించవచ్చు మనం.
అందుకోసమా మాధవుణ్ణి మానవుడి స్థాయికి దించి తీసుకువచ్చి ఒక
మహర్షి రామావతార రూపంగా మరొక మహర్షి కృష్ణావతార రూపంగా
మన ఎదుట నిలిపి వారి నోటనే పలికించారా రెండు పురుషార్ధాలనూ.
ఇది ఆ మహర్షులు లోకానుగ్రహ బుద్ధితో ప్రదర్శించిన ఒక గొప్ప గారడీ
Page 7