ఎంచేతనంటే మోక్షావస్థ మిగతా మూడు పురుషార్ధాలలాగా దృశ్యం కాదు. అది కేవలం దర్శనమే. కనుక దాన్ని వాటిలో చేర్చలేదు. అంచేతనే ధర్మార్థ కామాలు మూడూ త్రివర్గమనీ మోక్షాన్ని ఒక్కదాన్నీ అపవర్గమనీ శాస్త్రం పరిగణించింది.
ఇతః స్వాం ప్రకృతిం వాలీ గతః ప్రాప్తః క్రియాఫలం
సామదానార్ధ సంయోగైః పవిత్రం ప్లవగోత్తమః - 34
స్సధర్మస్యచ సంయోగా - జ్జితస్తేన మహాత్మనా
స్వర్గః పరిగృహీతశ్చ - ప్రాణా నపరిరక్షతా - 35
ఏషావై నియతిః శ్రేష్ఠా యాంగతో హరియూధపః
తదలం పరితాపేన - ప్రాప్తకాల ముపాస్యతాం - 36
అయితే అలాటి మోక్షాన్ని అందుకొన్నాడని చెప్పలేనీవాలి. అంతటి బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు కాడు. నిజమైన జ్ఞాని కహం మమ లుండరాదు. అవి ఉన్నంతవరకూ మిధ్యాత్మ గౌణాత్మలే తన స్వరూపమని బోల్తా పడుతుంటాడు మానవుడు. బ్రహ్మాత్మ నాత్మగా భావించలేడు. కాబట్టి వాలి ఎంత పరాక్రమవంతుడైనా ఇతః స్వాం ప్రకృతింవాలీ గతః తన ప్రకృతి కనుగుణంగానే తాను జీవిస్తూ వచ్చాడు. జన్మాంతరంలో చేసుకొన్నది సంస్కార రూపంగా ఉండిపోయి అది వర్తమాన జన్మలో అభివ్యక్తమైతే దానికి ప్రకృతి అని పేరు పెట్టారు శాస్త్రజ్ఞులు. అందువల్లనే ప్రాప్తః క్రియా ఫలం - దాని కనుగుణంగానే ప్రవర్తించాడు జీవితంలో. ఆ ప్రవర్తనకు తగిన ఫలమే అనుభవించాడు.
Page 69