#


Index

  అయితే అక్కడ మోక్ష పురుషార్థ ప్రసంగంలో చెబితే కృష్ణుడిక్కడ రాముడు ధర్మపురుషార్ధ ప్రసంగంలో చెబుతున్న మాట. స్వర్గతః పితా అని ఎప్పుడన్నాడో అప్పుడిది ధర్మమేగాని మోక్షం కానేరదు. మోక్షానికి ఇహపరాలు లేవు. అసలు దేశకాల వస్తువులనే మూడు పరిచ్ఛేదాలూ లేవు మోక్షంలో. అంతా కలిసి కేవల మాత్మ చైతన్యమే. పోతే దాని ఆభాసలే ఈ స్వర్గాది లోకాలన్నీ. లేదా దాని విభూతి అని చెప్పినా చెప్పవచ్చు. అంత మాత్రమే.

సస్వస్థా భవ మా శోచీ- ర్యాత్వా చావసతాంపురీం
తథా పిత్రానియుక్తోసి వశినా వదతాం వర - 21

  చేయవలసిన బోధ అంతా చేసి మరలా కధా భాగమందు కొంటున్నాడు మహర్షి రాముడిలా తమ్ముడికి బోధ చేసి సోదరా! నీవిక శోకించవద్దు. మాశోచీః - స్వస్థోభవ - స్తిమితంగా ఉండు. యాత్వా చ ఆవస తాం పురీమ్. మరలా అయోధ్యాపురానికి బయలుదేరి పోయి అక్కడే నివసించు. తధా పిత్రా నియుక్తోసి వశినా వదతాంవర అలాగే కదా తండ్రి గారు నిన్ను నియోగించారు అయోధ్యను రాజధాని చేసుకొని రాజ్య పాలన చేయమని గదా నీకాయన బోధించిన కర్తవ్యం. ఇంత ఉత్తమాభిజనంలో జన్మించి నీ కర్తవ్యమేదో నీవాచరించకపోతే ఏమి బాగు. కనుక నా మాట విని వెంటనే నీవు నీ పరివారంతో అయోధ్యకు ప్రయాణమయి పోవాలి సుమా.

Page 55