#


Index

ప్రస్తావన

  మనకు ఇద్దరే ఉన్నారు మహర్షులు, మహర్షులైనా వారే. మహా కవులైనా వారే. వారెవరో గాదు. వాల్మీకి మహర్షి ఒకరు. వ్యాసమహర్షి ఒకరు. మానవ జీవితానికి గమ్యమేదో దాన్ని దర్శించిన వాడే ఋషి. అది మరలా లోకానికి వర్ణించి చెప్పగలిగినవాడు కవి. దర్శనా దృషిః వర్ణనాత్కవిః అన్నారు మన పెద్దలు. అయితే ప్రతి ఒక్కడూ మనలో ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు చెబుతూనే ఉంటాడు గదా. అతడు ఋషి ఎలా అయ్యాడు. మనమంతా మామూలు మానవులమెలా అయ్యామని అడుగుతారేమో. మనదీ దర్శనమైనా దీనికి వ్యాప్తి లేదు. దేశంలో కాలంలో వస్తువులో ఎక్కడికక్కడ పరిమిత మైనదిది. సర్వతోముఖ మైనది గాదు. కనుక పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులతో Scientists సహా కేవలం మానవ మాత్రులం మనమంతా.

  పోతే ఈ మానవ జాతిలోనే పూర్వజన్మ సుకృత మనండి. వర్తమాన కృషిఫల మనండి. ఎవరీ మూడు పరిధులనూ దాటిపోగలరో - మరలా దిగివచ్చి ఆ చూచిన సత్యాన్ని లోకులకు చాటి చెప్పగలరో- వారే ఋషులూ వారే కవులని పేరు గాంచారు. అందుకే మహర్షులైనా మహాకవులైనా ఆ ఖ్యాతి వారికే దక్కుతుందని చెప్పటం. ఆ ఇద్దరిలో ఒకరు మహాభారత కర్త వేదవ్యాసుడైతే ఇంకొకరు శ్రీమద్రామాయణ కర్త వాల్మీకి. వారు రచించిన

Page 5