యధాహి సార్ధం గచ్ఛంతం బ్రూయా తశ్చత్పధి స్థితః
అహమప్యాగమిష్యామి పృష్ఠతో భవతామితి - 16
ఏవం పూర్యైర్గతో మార్గః - పితృ పైతా మహాధ్రువః
తమాపన్నః కధం శోచే ద్యస్య నాస్తి వ్యతి క్రమః - 17
అలాంటి స్థాయి నందుకోనంత వరకూ లోకంలో మానవులందరూ అవివేకులే. చదువులేని పామరులేగాదు. పండితమ్మన్యులైన శాస్త్రజ్ఞులూ వైదిక ధర్మ పరాయణులూ సంగీత సాహిత్యాది కళాకారులూ ప్రతి ఒక్కరూ బేవ కూపులే, పీత్వా మోహమయీం ప్రమాద మదిరా మున్మత్త భూతం జగత్తన్నాడు భర్తృహరి. ప్రతి ఒక్కడూ బాగా తప్ప తాగి మైకంలో బ్రతుకుతున్న వాడే ప్రపంచంలో. బ్రతుకుతున్నా ఆ బ్రతుకెప్పుడో ఒకప్పు డంతమయ్యేదే కాబట్టి బ్రతికినా చచ్చిన వాళ్లమే మనం. జీవచ్ఛవాలం. ఉమర్ ఖయ్యాము చెప్పినట్టు కొందరు నేల క్రింద ఉన్న శవాలు. కొందరు నేలమీద తిరుగుతున్న శవాలు.
ఈ తిరిగే మనబోటివాళ్ల మెప్పటికైనా ఆ పోయిన వాళ్లను కలుసుకో వలసిందే తప్పదు. ఇది ఎలాటిదంటే యధాహి సార్ధం గచ్ఛంతం సార్దమంటే బాటసారుల గుంపు. బయలుదేరి పోతున్నారు.
Page 49