శరీరం సడలిపోయింది కూడా. ఇంకా రెండేళ్లు మూడేళ్ళంటారే మిటండీ అని ఆశ్చర్యపోతూ అడిగారట మళ్లీ. దానికాయన ఏమని జవాబిచ్చాడో తెలుసా. అయ్యా వయసంటే జీవిస్తూ ఉన్న కాలం గదా. అల్లా స్వరూపమే నా స్వరూపమని దాని స్పృహలో బ్రతకటమే గదా జీవితం. అదే గదా వయసు. అలాంటి స్ఫురణ నాజీవితంలో కలిగిన క్షణాలన్నీ పోగు చేసుకొంటే రెండు మూడు సంవత్సరా లుంటాయో లేదో. అందుకే నేనలా చెప్పవలసి వచ్చిందని సమాధాన మిచ్చాడు.
అలాగే మనకా ఆత్మస్మృతి ఉన్నప్పుడే అది బ్రతుకు. అది లేని జీవితమంతా మరణమే. ఇది ఎలాటిదంటే దీపమెంత సేపు వెలుగుతూ పోతుందో అంత కాలమూ చీకటి కానరాదు. ఆ వెలుగెంతెంత తగ్గుతూ పోతే అంతంత చీకట్లు కమ్ముకు వస్తుంటాయి. అసలు దీపమే ఆరిపోయిందో అక్కడ ఉన్నదంతా ఇక చీకటే. చీకటి లాంటిదే ఈ మృత్యువనేది. దాని చాల్తీలే ఈ నామరూప క్రియలన్నీ. ఇదే సంసార బంధం మానవుడికి. ఇప్పుడీ సంసారమనే అంధకారం కూడా పటాపంచెలయి పోవాలంటే స్వరూప భావన అనే దీప ప్రకాశం నిరంతరమూ మన స్మృతి పథంలో నిలిచి ఉండాలి. ఇదే ఆహార శుద్ధె సత్త్వశుద్ధిః సత్త్వశుద్ధా ధ్రువాస్మృతిః స్మృతిలంభే సర్వగ్రంధీనాం విప్రమోక్షః అని ఛాందోగ్యం చాటుతున్న గొప్ప సుభాషితం.
Page 38