పూర్వగీత
అయితే మరి దీనికేమిటి పరిహారం. పరిహారమొక్కటే. అది మన వెంటబడుతుంటే మనం దాని వెంట బడాలి. మరణమంటే మారటం. మారటమంటే చలనం గదా. చలించకుండా మారదేదీ. కాబట్టి అది చలిస్తుంటే మనమూ చలిస్తూ కాదు దాన్ని పట్టుకోవలసింది. మన స్వరూప మచలమైన జ్ఞానమే నని గుర్తించి ఆ స్ఫురణతో దాని వెంటబడాలి. వెంటబడట మంటే వ్యాపిస్తూ పోవటం. ప్రతి దశలోనూ చలనాన్ని అచలం వ్యాపించే ఉందసలు. తరంగమెంత దూరం ప్రయాణం చేస్తూ పోయినా అదంతా జల స్వరూపమే గదా. తరంగమని చూస్తే చలనం. జలమని చూస్తే అచలం. అలాగే ప్రతిక్షణమూ ఈ పిండాండమూ బ్రహ్మాండమూ చలిస్తూ ఉంటే ఈ చలనాన్ని సాక్షిగా చూస్తున్న మన చైతన్యమే మాత్రమూ చలించటం లేదు. అంచేత అదే నా స్వరూపమీ శరీర మనః ప్రాణాదులు కావని నమ్మి గట్టిగా దాన్ని పట్టుకోగలిగితే మనం మృత్యుంజయులమే. సందేహం లేదు.
గాత్రేషు వలయః ప్రాప్తాః - శ్వేతా శ్చైవ శిరోరుహాః
జరయా పురుషో జీర్ణః కిం హికృత్వా ప్రభావయేత్ - 10
Page 35