#


Index

పూర్వగీత

  మొట్టమొదట రామోపదేశం అయోధ్యాకాండలో జరిగింది. తండ్రి ఆజ్ఞ శిరసావహించి రాము డరణ్యవాసం చేస్తున్నాడు. భరతుడాయన నెలాగైనా పట్టణానికి తీసుకువచ్చి పట్టాభిషిక్తుణ్ణి చేయాలని పట్టుపట్టాడు. మాతృ మంత్రి పరివార సమేతంగా దండకారణ్యానికి బయలుదేరాడు. అక్కడ అన్నగారి పాదాలు పట్టుకొని తండ్రిగారి మరణవార్త తెలుపుతూ విలపించసాగాడు. అది చూచి రాముడతణ్ణి ఓదారుస్తూ మాటాడుతున్న సందర్భమిది.

తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినమ్
రామః కృతాత్మా భరతం సమాశ్వాసయ దాత్మవాన్ - 1

  దుఃఖితం భరతం - తండ్రి పోయాడే అన్న అడవుల పాలయ్యాడే అని బాధపడుతున్నాడు భరతుడు. విలపంతం. అయ్యో అని ఆక్రందన చేస్తున్నాడు. పోనీ తెలియనివాడా అంటే యశస్వినం చాలా గొప్ప జ్ఞాని అని లోకానికంతా విదితమే. అయినా సందర్భ మలాంటిది. అయితే రాముడెలాంటి వాడు. కృతాత్మా - ఒకరికి చెప్పాలంటే దానికి యోగ్యత Qualification ఉండాలి.

Page 10