విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
రెండూ భగవచ్చెతన్యం నుంచి వచ్చినవే. రెండూ దానిలో బ్రతుకుతున్నవే. దాని విభూతే గనుక చివరకు అవి దానికభి ముఖంగా పోయి అందులో కలవవలసినదే. ఇంతకూ వీటిని గాదు. వీటి ప్రవృత్తి ద్వారా మనం పట్టుకోవలసింది ఆ తత్త్వమే సుమా అని భగవానుడి ప్రబోధం.
ఇంకా అతనికి విజయం నిశ్చయమని మనసులో విశ్వాసం కలిగించటాని కెలా కనిపిస్తున్నాడో తెలుసా పరమాత్మ. లేలిహ్యసే గ్రసమాన స్సమంతాత్. లోకాన్ సమస్తాన్ వదనై ర్జ్వలద్భిః తేజోభి రాపూర్య జగత్సమగ్రం. అగ్ని జ్వాలలాగా మండిపోతున్నాయట ఆయన ముఖాలు. ముఖాలు కూడా కాదు. ఆ మాటకు వస్తే భయంకరంగా చాచిన నాలుకలే ఆజ్వాలలు. వాటితో లేనిహ్యసే గ్రసమానః - తనలో వచ్చి చేరిపోతున్న జీవులనందరినీ ఊరగాయలాగా ఆస్వాదించి మ్రింగి జీర్ణం చేసుకొంటున్నాడా మహానుభావుడు. తేజోభిరాపూర్య - దశదిశలా ప్రసరించే ఆ దివ్య తేజస్సులతో జగత్సమగ్రం - బ్రహ్మాండమంతా వ్యాపించి త్రివిక్రమావ తారంలాగా దర్శనమిస్తున్నా వని వర్ణిస్తున్నాడా భయానకమైన రూపాన్ని అర్జునుడు.
ఆఖ్యాహి మే కో భవా నుగ్రరూపో
నమోస్తుతే దేవ వర ప్రసీద
విజ్ఞాతు మిచ్ఛామి భవంత మాద్యం
సహి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ - 31
Page 421