విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ఇందులో స్వరూపాన్ని గురించి ప్రశ్నించ డర్జునుడు. అది తెలుసుకోవాలనే ఇచ్ఛ లేదు. ఎంతసేపటికీ దాన్ని ప్రక్కన బెట్టి దాని విభూతిని దర్శించాలనే కుతూహల మతనికి. అది అతని మాటల్లో స్పష్టంగా కనపడుతున్నది. కాని ఒకటి గుర్తించటం లేదతడు. స్వరూప జ్ఞానం పూర్తిగా లేకుండా కేవలం భగవద్విభూతిని మాత్రమే దర్శించాలని ఉబలాట పడ్డా అది సమగ్రం కాదా జ్ఞానం. అనుభవమంత కన్నా కాదు. అది సర్వసాధారణమైనా అసాధారణంగా తన కొకడికే భగవానుడు ప్రదర్శించినా అది కేవలం గారడీ ప్రదర్శనే. లోకులు నిత్యమూ చూచే ఈ విశ్వరూపమూ అసత్యమే. ఇదుగో చూపుతున్నా చూడమని కొత్తగా ఏదో ఒక విశ్వరూపాన్ని ప్రదర్శించినా అదీ అసత్యమే. అసత్యం కూడా సత్యమనే భావిస్తున్నాడు కాబట్టి అర్జునుడు తుష్యతు దుర్జనః ఇతి న్యాయేన అతని కేదో చూపినట్టు చేసినట్టు నటిస్తాడంత మాత్రమే. అర్జునుడి కంటే తెలియదు గాని సర్వజ్ఞుడైన పరమాత్మకు తెలియదా సత్యమేదో అసత్యమేదో.
మన్యసే యది తచ్ఛక్యం - మయా ద్రష్టుమితి ప్రభో
యోగేశ్వర తతో మే త్వం - దర్శయా త్మాన మవ్యయమ్ - 4
తెలియని వాడు గనుకనే అమాయికంగా ఆయనను ప్రాధేయపడుతున్నాడు. ఏమని. మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి. నీవు ప్రదర్శించబోయేది నేను దర్శించగలనని నీ కనిపిస్తే మాత్రం తతో మే దర్శయాత్మాన మంటాడు. అనిపించవలసిం దాయనకా. తనకా. ఎవరి
Page 380