జ్ఞాన యోగము
భగవద్గీత సర్వస్వం
అన్నిటికీ ఆది పరమాత్మే. ఆదిలో ఉన్నాడని గాదు. ఆదే పరమాత్మ. అలాటి వాడికిక ఆది లేదు. అంటే జన్మ అనేది ఉండటానికి లేదు. జన్మ లేకుంటే మరణం లేదు. అనాది మధ్యలయుడు పరమాత్మ అని చెప్పినట్టయింది. పోతే ఈ దేవతలూ మహర్షులో. వీరికి తానాది అనటం వల్ల వీరి కాది అంతమూ రెండూ ఉన్నాయని చెప్పకుండా చెప్పినట్టయింది. అంటే అజరత్వమూ అమరత్వమూ భగవత్పాదులు చెప్పినట్టు వారి కాపేక్షికమే Relative గాని నిత్యం కాదనే సత్యం కూడా తెలిసిపోతున్నది. మరి అనిత్యమైన వారి జ్ఞానానికి నిత్య జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ అంతుపట్టక పోవటంలో ఆశ్చర్యమేముంది.
యో మామజ మనాదించ- వేత్తి లోక మహేశ్వరం
అసమ్మూఢ స్స మర్త్యేషు - సర్వపాపైః ప్రముచ్యతే - 3
అయితే మరి మహా ప్రభావ సంపన్నులైన ఆ దేవతలకూ మహర్షులకే అంతు పట్టలేదని చెబుతున్నారే. ఇక అల్పజ్ఞులమూ అల్పశక్తులమూ అయిన మనబోటి మానవమాత్రుల కేమి బోధపడుతుందా భగవత్తత్త్వమని బెంబేలు పడవచ్చు మనం. అసలా దేవతలూ లేరు. మహర్షులూ లేరెక్కడా. ఉన్నది మన లాంటి మానవులమే. కేవలం మన భావనే వారంతా ఉన్నారను కోవటం. నేననే స్ఫురణ తప్ప దానికి గోచరించే సర్వమూ ఆ భాస అని శాస్త్రం చెబుతున్నప్పు డిక దేవత లెక్కడున్నారు. మహర్షు లెక్కడున్నారు. మనబోటి మానవులు మాత్రమెక్కడున్నారు. అయితే అది గ్రహిస్తేనే ఆ
Page 280