సాంఖ్య యోగము
భగవద్గీత
మూలాన్నే అందులో కూచో గలుగుతున్నాం. మరలా దాన్ని వదిలేసి వెళ్ల గలుగుతున్నాం. అలా కాక కుర్చీయే నేనయి పోయానని భ్రమపడ్డా ననుకోండి. దాన్ని విడిచి బయటికి పోగలనా చెప్పండి. పోయినా దాన్ని నెత్తి పెట్టుకొనే పోవలసి వస్తుంది.
ప్రస్తుతమలాంటి దుస్థితే ఏర్పడింది మన ఆత్మకు. అనే న జీవే నాత్మనా అను ప్రవిశ్య అని ఛాందోగ్యం చెప్పినట్టు అది ఈ శరీరంలో వచ్చి ప్రవేశించింది. ప్రవేశించినా ప్రవేశించాననే స్పృహ లేదు దానికి. స్పృహే ఉంటే ఎలా వచ్చి చేరిందో అలా దీన్ని వదిలేసి పోగలిగేది. బుద్ధి పూర్వకంగా వస్తే గదా బుద్ధిపూర్వకంగా వెళ్లగలిగేది. ఎవరో మెడపట్టితోస్తే వచ్చిపడ్డాడు. మరలా పట్టి తోస్తే వెళ్లిపోతున్నాడు ప్రతి జీవీ. ఇదే జీవాత్మ భావమంటే. దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్ణిస్తున్న దిప్పుడు గీత.
వాసాంసి జీర్ణాని యధా విహాయ మాసి జీర్ణమైపోయిన బట్టలు వదిలేసి నవా ని గృష్ణతి నరో పరాణి వాటి బదులు క్రొత్త బట్ట లెలా ధరిస్తామో - అలాగే శరీరాణి విహాయ జీర్ణాని జరా జర్జిరిత మైన శరీరాలను కూడా వదిలేసి - అన్యాని సంయాతి న వాని దేహీ. మరి ఒక క్రొత్త శరీరంలోకి వెళ్లి కూచుంటున్నాము. ఇక్కడ ముందున్న శరీరాన్ని విడిచిపెట్టటం మరణమైతే - మరొక శరీరంలో ప్రవేశించటం జననం. మరణంతో సమసి పోవటం లేదు జీవుడి యాత్ర.
Page 97