#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

చెబితే చెప్పవచ్చుగాని అది జీవితంలో ఆచరణ యెగ్యమా. యుద్ధం చేసి ఒకరిని చంపినా అది చంపటం కాదా. దానివల్ల పాపం రాదా. అలాగైతే ఒక పామరుడికీ బ్రహ్మవేత్తకూ తేడా ఏముంది అని అడిగితే ఏమిటి జవాబు. దానికే జవాబిస్తున్న దిప్పుడీ శ్లోకం. ఇదీ దీని తరువాతిదీ ఈ రెండు శ్లోకాలూ ఋగ్వేదంలోని మంత్ర వర్ణాలు. ఆత్మ ఏ క్రియకూ ప్రవర్తకం కాదు నివర్తక మనే సత్యాన్ని బలపరచటానికి గీత ఈ ఋగ్వేద మంత్రాలను పట్టుకొని వచ్చిందంటారు భగవత్పాదులు.

  ఇక్కడ ఒక విషయం బాగా వివేచన చేసి చూడాలి మనం. లేకుంటే ఇదేమిటిలా మాటడుతున్నది భగవద్గీత అని కంగారు పడతాము. ఆత్మ అనేది అవిక్రియం. దానితో ఏ వికారానికి గానీ చోటు లేదు అని మాత్రమే మనం దీని ద్వారా అర్ధం చేసుకోవలసిన విషయం. అంతేగాని ఒకరిని చంపటమూ చంపకపోవటమూ కాదు. అదైనా ఎందుకు ప్రస్తావించిందంటే గీత - అర్జునుడు క్షత్రియుడు. అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత పెట్టుకోవలసినవాడు. అందులో ఇంతమంది సైనికులను సంహరిస్తున్నాను గదా ఇది మహాపాపమనే భీతాహ ముండగూడ దతనికి. అందుకోసమీ చంపటమనే క్రియ ఇక్కడ ప్రస్తావనకు వచ్చిందే గాని అసలిదే చెప్పటం కాదు ఉద్దేశం. లోకంలో ఉన్న మానవులందరూ అర్జునుడి లాంటి క్షత్రియులు కారు గదా. అంచేత దినచర్యలో ఎవడే పని పెట్టుకొన్నా ఈ పని నేను చేస్తున్నాననే

Page 87

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు