#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

పోవటమందుకే. తుదకు మూర్ఛా మరణాదులలో అసలే మాసిపోవటం కూడా అందుకే. మనః ప్రాణాలు రెండూ పనిచేయకుండా ఆగిపోయే సరి కది కూడా ఆగిపోవలసి వస్తున్నది. ధ్యాయతీవ లేలాయతీవ మనసు ధ్యానం చేస్తుంటే అది ధ్యానం చేస్తుంటుంది. అది డోలాయ మానమైతే ఇదీ డోలాయమాన మవుతుంది.

  బృహ దారణ్యకంలో వస్తుందీ సందర్భం. యాజ్ఞవల్క్యుడు మైత్రేయి కాత్మ స్వరూపం ప్రజ్ఞాన ఘన మది ఎప్పటికీ నశించేది కాదని చెబుతూ ఒక మాట అన్నాడు. న ప్రేత్య సంజ్ఞాస్తి మరణిస్తే తెలివి తప్పుతుందని పేర్కొంటాడు. ఆ మాట వినేసరికి మైత్రేయికి మతి పోతుంది. అత్రైవమా భగవా నమూముహత్. ఇదేమిటి మహానుభావా అది ప్రజ్ఞాన ఘనమని ఘనంగా చెబుతారు. మరలా మరణిస్తే ప్రజ్ఞ తప్పుతుందంటారు. ఏమిటిదంతా ప్రజ్ఞాన ఘనమైతే ఎలా మరణిస్తుంది ఎలా తొలగిపోతుంది. మొత్తానికి నా మతి పోగొడుతున్నారు మీరు మీ మాటలతోనని వాపోతుంది. దానికి సంజాయిషీ ఇస్తూ నా హం మోహం బ్రవీమి అని ఒక్క మాటలో కొట్టి వేశాడు యాజ్ఞవల్క్యుడు. పోతే యాజ్ఞవల్క్యుడి వద్ద వకాలతా పుచ్చుకొని భగవత్పాదులు సంజ్ఞా అనే దానికి ముందు విశేష అని ఒక మాట దూర్చాడు. అప్పటికి సంజ్ఞా నాస్తి అనే మాటకు విశేష సంజ్ఞా నాస్తి - అని అర్ధం చెప్పుకోవాలి మనం.

Page 79

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు