#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి || 17 ||

  ఏతా వతా మనకు తేలిన సారాంశమేమిటి ఆత్మ తప్ప విడిచి వస్తుతః మరేదీలేదు. మాత్రా స్పర్శల దగ్గరి నుంచీ సుఖదుఃఖాదుల వరకూ అన్నీ అబద్ధమే. అవే హుళక్కి అయినప్పుడిక వాటి ఒత్తిడిని మనం భరించటం భరించక పోవటమనే ప్రశ్నేముంది. ఎప్పటికప్పుడా గమా పాయులుగా వాటి రాకపోకలను ఒక ఇంద్రజాలంలాగా చూస్తూ కూచోటమే మనం చేయవలసిన పని.

  కాని అలా చూస్తూ ఉన్న మన జ్ఞానం కూడా స్థిరంగా ఎక్కడ ఉంది. అది కూడా జ్ఞేయ ప్రపంచంలాగా వస్తూ పోతూ ఉన్న బాపతే గదా. అలాగే కదా మనకిప్పు డనుభవం. జాగ్రత్తులో ఉన్న జ్ఞానం స్వప్నంలో లేదు. స్వప్నజ్ఞానం కూడా సుషుప్తిలో అసలే లేదు. రేపు మరణిస్తే ఏమాత్రమూ లేదు. సర్వనాశనమే గదా అని ఒక పెద్ద ఆ శంక మన కందరికీ. దానికి జవాబిస్తున్నదీ శ్లోకం. ఏమని.

  నీవు నాశన మయిపోతున్నదే అని భయ పడుతున్నది మేము చెప్పే జ్ఞానం కాదు. అది వృత్తి జ్ఞానం లేదా విశేష జ్ఞానం. అది నీ శరీరం మేరకే పరిచ్ఛిన్న Limited మైన జ్ఞానం. శరీర మనః ప్రాణాల మేరకే ఆగిపోయి వాటితో మమేకమైనది కాబట్టి అది శరీరమే పాటు పడితే ఆ పాటు పడుతుంది. జాగ్రదాద్యవస్థలలో హెచ్చుతూ తగ్గుతూ

Page 78

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు