సాంఖ్య యోగము
భగవద్గీత
ఒక రజ్జువు సర్పంగా భాసిస్తుంటుంది. ఒక స్తంభం చీకట్లో దొంగ లాగా భ్రమ గొలుపుతుంది. ఒక శుభ్రమైన ఆకాశమే నల్లని రంగు పూసుకొని కనిపిస్తుంది. ఇంతెందుకు. ఒక సముద్ర జలమే ఎన్నో తరంగాలుగా బుద్బుదాలుగా ఫేనాలుగా భాసిస్తూ వాటన్నిటినీ తన మీద కప్పుకొని చూడండి నావైపు అని కేకలు పెడుతుంటుంది. ఒక బంగారమే కటక కుండల కేయూరాదులైన అనేక రూపాలు ధరించి ఆ వేషాలతో కనిపిస్తూ మనల నాకర్షిస్తుంది. ఇవన్నీ దేనికి. అసలు మనకు ప్రతి రాత్రీ వచ్చే స్వప్నమే తీసుకొని చూడండి. ఏముందక్కడ పడుకొన్నప్పు డే మీ లేదు మన పడక గదిలో. ఏదైనా కనపడటాని కసలు మన కళ్లు కూడా మూతపడి ఉన్నాయి. పడ్డాయో లేదో ఎన్ని చిత్ర విచిత్రమైన దృశ్యాలు మన ఎదట సాక్షాత్కరిస్తాయో చెప్పలేము. అంతకు ముందు లేని విప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాయి. మరి తెల్లవారితే ఏమయి పోయాయి.
అప్పటికి లోకానుభవమని మనం మురిసిపో నక్కరలేదు. లోకానుభవంలో అంతా ఉన్నదే ఉందని - లేనిదే లేదని దర్శించటం లేదు మనం. ఉన్నది లేదనీ లేనిది ఉందనీ బోల్తా పడి చూడడం కూడా లోకానుభవమే. ఆ మాటకు వస్తే లోకానుభవ మంతా కూడా నూటికి నూరు పాళ్లూ తారుమారుగా చూడటమే నని సిద్ధాంతం చేశారు వేదాంతులు. అది ఎలాగ అని మన కాశ్చర్యం వేస్తుంది. కాని వారు
Page 73