సాంఖ్య యోగము
భగవద్గీత
పరమాత్మ - తధా దేహాంతర ప్రాప్తిః అని. తథా అంటే ఈ దేహం పోయినా పూర్తిగా పోలేదు నీవు. కనుక అది మరణం కాదు. మరొక దేహం నీకు తయారుగా ఉంటుంది. అందులో చేరి మరలా జన్మిస్తావు భయపడ వద్దని ధైర్యంగా ఉండమంటాడు.
కాని ఇది సమస్యకు పరిష్కారం కాదు. పరిష్కారం మానవుడికి జనన మరణాలు రెండూ లేక పోతేనే. అది నేను జీవుడనే భావం నీకున్నంత వరకూ ఆసించలేవు. ఒక శరీరం పోయినా మరొక శరీరం ప్రాప్తిస్తూనే ఉంటుంది. అదిపోతే ఇంకొకటి. జనన మరణ పరంపర తప్పదు. కాబట్టి ఈ విషవలయం నుంచి పూర్తిగా బయట పడాలంటే నేను జీవుడననే బుద్ధికి స్వస్తి చెప్పి శుద్ధ చిన్మాత్ర స్వరూపుడననే ప్రత్యగాత్మ భావమేర్పడాలి మానవుడికి. అప్పుడిక మరణించినా అది నీ శరీరమనే ఉపాధికే గాని నీకు గాదు. ఎందుకంటే ఆకాశాత్మా అని ఛాందోగ్యం చెప్పినట్టు ఆకాశంలాగా విస్తరించి ఉంటావు నీవు. నిరాకారమైన చిదా కాశ స్వరూపుడవు కాబట్టి మరణం లేదు నీకు. మరణమంటే మార్పు చలనం. అది సాకారానికే గాని నిరాకారాని కేర్పడదు. మరణమే కాకుంటే ఇక జననమనే ప్రశ్న అసలే రాదు. అంటే దేహాంతర ప్రాప్తి అనే మాట వాడికి వర్తించదు. ఒక వేళ వర్తిస్తుందని చెప్పినా అది దేహాంత రప్రాప్తి. దేహాంతః దేహంలోపల అప్రాప్తి చేరి పోవడమంటూ ఉండదని విరిచి అర్ధం చెప్పవలసి ఉంటుంది. లేదా దేహం కాని దేహ మాకాశం. ఆకాశాత్మా
Page 61