సాంఖ్య యోగము
భగవద్గీత
అప్పటికి శరీరమే నేను కాననే సత్యం తెలిసిపోయింది గదా మనకు. శరీరమే నేనయితే అది సుషుప్తిలో మనకెందుకు గోచరించటం లేదు. అయితే మనకు మనమూ ఉన్నట్టు స్ఫురించటం లేదు గదా అని అడగవచ్చు. స్ఫురించటం లేదు. అంత మాత్రమే. సర్వాత్మనా పోలేదు మనం. ఏమిటి నిదర్శనం. అప్పటికి గుర్తు లేకపోయినా తెల్లవారగానే గుర్తు వస్తున్న దప్పుడూ నేనున్నానని. నేనే లేకపోతే ఆ దశ నను భవించిం దెవరు. దశే దశ ననుభవించ లేదు గదా. దశానాధు నుండి గదా దశ నను భవించ వలసింది. కనుక మూడవ స్థల లోనూ నేననే జ్ఞానం అనువృత్త Con-tinue మవుతూనే ఉంది. ఎటు వచ్చీ అవస్థలూ వాటిలో మనకు గోచరించే దేహాదులే వ్యావృత్త Discontinue మవుతున్నాయి.
ఇది మన కిప్పుడున్న అనుభవం. జీవిత కాలంలో మనకున్న ఈ ప్రత్యక్షానుభవాన్ని బట్టి పరోక్షంగా రేపు జరగబోయే వ్యవహారాన్ని మన మర్ధం చేసుకోవలసి ఉందంటాడు పరమాత్మ. తధా దేహాంతర ప్రాప్తిః రేపు మరణ సమయంలో ఈ కనిపించే దేహం పూర్తిగా పోయి నీకు మరొక దేహం ప్రాప్తిస్తుం దేమో. ఎందుకు నమ్మవు. స్వప్నంలో రావటం లేదా వేరొక దేహం. అలాగే మరణానంతరమూ రావచ్చు. అయితే స్వప్నంలో మనకీ ప్రాణమనేది పోవటం లేదు. ప్రాణం ఉండగానే వస్తున్నాయి పోతున్నాయి స్వప్న సుషుప్తులు. పోతే మరణావస్థ అలాంటిది కాదు. అందులో ప్రాణమే ఆగిపోతున్నది. దానితోపాటు మనసూ నిలిచి
Page 59