#


Index

ఉపసంహారము (ప్రధమ) భగవద్గీత

బాహ్యంగా చరాచర ప్రపంచం వీడికి అన్యంగా కనిపిస్తుంటుంది. అదే సంసార బంధం జీవుడికి. ఎప్పుడైతే శోధన చేశామో కర్తృత్వ భోక్తృత్వా లెగిరిపోయి శుద్ధ చైతన్యాత్మకంగా మిగిలిపోతాడు జీవుడు. అప్పుడు జీవాత్మ కాడు వీడు. ప్రత్యగాత్మ. దీనికే లక్ష్యార్ధమని పేరు. లక్ష్యార్ధమనేది కొత్తగా మనం సృష్టించటం లేదు. అసలు మొదటి నుంచీ ఉన్నదదే. శుద్ధ చైతన్యమే మన స్వరూపం. దీన్ని మనం శోధించనక్కరలేదు. దానికి పట్టిన మాలిన్యాన్ని కడిగేయటమే మనం చేయవలసిన పని. అలా కడిగేస్తే ఏది మనకు సహజం కాదో అది తొలగిపోతుంది. ఏది మన స్వరూపమో అది మిగిలిపోతుంది. దీనికే భాగత్యాగ లక్షణ అని పేరు పెట్టా రద్వైతులు. జీవుడి మీద అజ్ఞానవశాత్తూ ఆరోపితమైన కర్తృత్వాదులను త్యాగం చేయాలి. జీవుడి స్వరూపమైన శుద్ధ చైతన్యాన్ని భజించాలి. అంటే దక్కించుకోవాలి. ఒక భాగాన్ని త్యాగం చేయాలి. ఒక భాగాన్ని నిలుపుకోవాలి. నేను నేననే స్ఫూర్తిని నిలుపుకోవాలి. అది కానిదంతా వదులుకోవాలి. అప్పుడది ఈశ్వర సాయుజ్యానికి సిద్ధమయి ఉంటుంది. ఇదే త్వం పదార్ధ శోధనలో ఉన్న రహస్యం.

  అదే ఇప్పుడీ మొదటి షట్కంలో జరిగిన ప్రక్రియ. ఆరధ్యాయాలలో మొట్టమొదట మన సమస్య ఏదో ప్రస్తావించాడు. అహం మమలే సమస్య. అదే విషాదయోగ మర్జునుడికి. కురుక్షేత్రం మమకారానికి నిలయమైన

Page 553

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు