ఉపసంహారము (ప్రధమ)
భగవద్గీత
వ్యాపిస్తుంది. దేహమేమిటి. దేహం చుట్టూ ఉన్న ప్రపంచమేమిటి. ఇటు పిండాండమూ అటు బ్రహ్మాండమూ రెండూ దానితో నిండిపోతాయి. చరాచర పదార్ధాలన్నింటి లోపలా వెలపలా మధ్యలో అంతా చైతన్యమే. అంతవరకూ వాస్తవంగా తోచిన జీవజగత్తులు రెండూ ఇప్పుడా చైతన్యం తాలూకు ఆభాసలుగా ఇంకా చెప్పవలసి వస్తే దాని విభూతిగా దర్శన మిస్తాయి. సంసారం విభూతిగా మారుతుంది. కాబట్టి సాంసారిక మైన తాపత్రయ మప్రయత్నంగా సమసిపోతుంది. అదే పరిష్కారం జీవిత సమస్యకు
అంచేత ఇలాటి పరిష్కారం త్వం పదార్ధ శోధన వల్లనే జరగవలసి ఉంది. త్వం పదార్ధమంటే జీవుడని గదా చెప్పాము. అహంకార మమకారాలే జీవుడని కూడా చెప్పాము. అవి ఉపాధులే గాని స్వరూపం కావు జీవుడికి. జీవుడి స్వరూపం కేవలం చైతన్యమే. దానిమీద ఆరోపితమివి రెండూ. దానికి కారణమవి నా స్వరూపానికి వేరు కావని తెలియక పోవటమే. అదే అజ్ఞానం. దాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానమే దానికి మందు. కనుక నా స్వరూపమేదో దాన్ని గుర్తించి తద్వారా ఈ అహం మమలను దానిలో లయం చేసుకోటమే శోధన.
శోధన చేయనంత వరకూ వాచ్యార్ధమే గాని లక్ష్యార్ధం మన అనుభవానికి రాదు. కర్తృత్వ భోక్తృత్వాలతో గూడిన జీవ భావమే వాచ్యార్ధం. అప్పుడు జీవుడు శరీరమాత్ర పరిచ్ఛిన్నంగా కనిపిస్తుంటాడు. శరీరానికి
Page 552