ఉపసంహారము (ప్రధమ)
భగవద్గీత
పేరు వచ్చింది. ఇందులో అహమనే భావమే జీవుడు. మమ అనే భావమే జగత్తు. అహమనే జీవభావం లేకపోతే మమ అనే జగద్భావ మెగిరిపోతుంది. వీడు శరీరం మేరకు తగ్గిపోవటం వల్లనే అది వీడి కన్యంగా పెరిగిపోయింది.
ఆ మాటకు వస్తే అసలీ రెండూ వస్తుతః లేవు. జీవుడూ లేడు. వీడు వ్యవహరిస్తున్న జగత్తూ లేదు. వస్తు సిద్ధం కావివి. ప్రతీతి సిద్ధం Apparant. జీవుడి అజ్ఞానం వల్లనే అఖండమైన ఆత్మ చైతన్యమిక్కడ ఒక జీవుడుగా అక్కడ ఒక జగత్తుగా విభక్తమయి గాని వస్తువు కాదిది. మన అజ్ఞానం వల్లనే గోచరిస్తున్నది. ఆ భాసే ఆభాసగా చూడవలసిన వాటిని మనం వాస్తవమని భావించి వాటికి వాస్తవత్వాన్ని కల్పించాము. అదే ఈ సంసార బంధం. తన్నిమిత్తంగానే జనన మరణాది కృతమైన విషాదం జీవుడికి.
కనుక ఈ జీవ భావాన్ని శుద్ధి చేయవలసిన బాధ్యత ఏర్పడింది మానవుడికి. చేయకుండా ఇలాగే ఉంచుకొంటే తాత్కాలికంగా అన్ని వ్యవహారాలూ సాగిపోతే పోవచ్చు గాని జనన మరణాది సంసార సమస్యకు మాత్రం పరిష్కారం చేసుకోలేము. జీవభావాన్ని శుద్ధి చేస్తే చాలు. జగద్భావాన్ని చేయనక్కర లేదు. జీవుడు పోతే జగత్తు పోతుంది. కారణమేమంటే దేహంలో బందీ అయిన చైతన్యమే జీవుడని చెప్పాము. దేహం నుంచి అది బయటపడిందో అది నిరాకారం కాబట్టి సర్వత్రా
Page 551