#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

మాత్రమూ అంతు పట్టదట. జీవిత మధ్యంలో జరిగేదే మనకంతు పట్టటం లేదు. ఇక ముందు వెనుకలే మర్దమవుతాయి. ఏమి కారణం. వాడు సర్వజ్ఞుడైతే మన మల్పజ్ఞులం. వాడు సర్వశక్తి సమన్వితుడైతే మన మశక్తులం. అల్పశక్తులం. కనుకనే జీవితాంతంలో ఎవడి కేమవుతుందో ఊహించలేడు మానవుడు. ఊహించినా అది ఊహే కాని వాస్తవం కాదు. అంచేత అలాటి వాస్తవమేదో తెలుసుకోవాలని కోరటం సహజమే. ఎలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకొంటాడు. ఎవరి నడిగితే ఎవడు చెబుతాడు. ఱోలు పోయి మద్దెలతో మొరపెట్టినట్టు ఎవరి నడిగినా ప్రయోజనం లేదు. మానవులందరూ పరిమిత ప్రజ్ఞావంతులే. పరిపూర్ణమైన జ్ఞానమెవడికీ లేదు. ఋషులు దేవతలే పనికి రారంటున్నారు భగవత్పాదులు. ఇక మానవ మాత్రుల విషయం చెప్పేదేముంది. మరి ఎవరి నడిగి తెలుసుకోవాలీ రహస్యం. సర్వజ్ఞుడైన పరమాత్మ నొక్కడినే. వాడే కృష్ణ రూపంగా కనిపిస్తున్నాడెదుట. అందుకే ఆయననే పట్టుకొని ప్రశ్నిస్తున్నా డర్జునుడు సందేహ నివృత్తి చేయమని.

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కళ్యాణకృత్ కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || 40 ||

  చూడండి. ఇక ఇక్కడి నుంచి సమాధానమిస్తూ పోతాడు కృష్ణ పరమాత్మ. ఆ ఇవ్వటంలో ధర్మ పురుషార్ధాన్ని పట్టుకు వస్తాడు రంగంలోకి. జ్ఞానమిక్కడి కిక్కడే ఫలిస్తే లేదు గాని ధర్మమనే ప్రసక్తి - ఫలించ లేదో-

Page 530

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు