సాంఖ్య యోగము
భగవద్గీత
తెలివి తేటలు చూపుతున్నాడు. తెలివి లేక ఏడుస్తున్నాడు. ఇంతకూ జ్ఞానముందా అర్జునుడికి లేదా. శాస్త్రీయంగా సమాధానం చెబితే జీవాత్మ జ్ఞానముంది. ప్రత్యగాత్మ జ్ఞానం లేదు. దేవుడు మేలు చేస్తే దేహాత్మ జ్ఞానమే ఎక్కువ మోతాదులో ఉందేమో కూడా. అర్జునుడికనే గాదు. మనలాంటి అర్జునులను కూడా పట్టి పీడిస్తున్న దిదే. దేహమే ఆత్మ అనే జ్ఞానం ముమ్మరంగా ఉంది మనకు. శాస్త్రం కూడా వింటుంటాము కాబట్టి లోకాంతర జన్మాంతరా లున్నాయి గనుక జీవాత్మగా రాకపోకలు చేస్తుంటామనే జ్ఞానం కూడా సవసవగా ఉంది. రెండింటిలోనూ జనన మరణాలనేవి మనలను వెంటాడుతునే ఉన్నాయి. తప్పించుకోలేము. తప్పించుకొనే ఉపాయమేదైనా ఉందా అని ప్రశ్న. దీనికిప్పుడు సమాధాన మిస్తున్నాడు భగవానుడు.
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12 ||
అర్జునా నీవు పూర్తిగా తెలిసినవాడవు కావు. అసలు తెలియని వాడవు కావు. కొంత తెలుసు కొంత తెలియదు నీకు. పూర్తిగా తెలిసినవాడు ప్రత్యగాత్మ వాది. అసలు తెలియని వాడు దేహాత్మ వాది. నీవిటు దేహాత్మతో తృప్తి పడటం లేదు. అటు ప్రత్యగాత్మ స్థితి నందుకో లేదు. మధ్యలో జీవాత్మ భావంతో సతమత మవుతున్నావు. కనుకనే జీవించే వారంతా మరణిస్తారే అని - మరణించిన వారంతా ఎక్కడో ఉన్నారు మనకంతు
Page 53