ఆత్మసంయమ యోగము
భగవద్గీత
ఫలించటాని కవకాశ ముండాలి. అయితే అప్పటికి జన్మాంతరా ల సత్యమని చెప్పటం దేనికి. వాస్తవమేనని చెప్పండి అని ప్రశ్నించవచ్చు. అజ్ఞానం వదలనంత వరకూ వాస్తవమే ననుకోండి. తప్పేమీ లేదంటాడు వ్యాసభగవానుడు. స్వప్నం లాంటిదిది. స్వప్నం చూస్తున్నంత వరకూ వాస్తవమే ఆదశ. అలాగే ఆత్మ జ్ఞానం లేక అనాత్మ ప్రపంచమనే స్వప్నావస్థలో ఉన్నంత వరకూ మానవుడికి లోకాంతరా లున్నాయి. జన్మాంతరా లున్నాయి. అన్నీ ఉన్నాయి. అయితే వ్యావహారికంగానే వాటి కస్తిత్వం. పారమార్ధికంగా కాదు. స్వప్నంలో నుంచి మెళకువ వస్తే అంతవరకూ చూచిన స్వప్న ప్రపంచం హుళక్కి అయినట్టే సర్వమూ ఆత్మ స్వరూపమనే జ్ఞాన ముదయిస్తే చాలు. ఈ లోకాంతర జన్మాంతరాలనే వ్యవహారం కూడా ఆభాస అయిపోతుంది. అసత్యమైనా సత్యాన్ని పట్టుకొనే వరకూ స్వప్నంలాగా ఈ దీర్ఘకాల స్వప్నం కూడా మనకు సహాయ పడుతున్నది. కనుక అది దృష్టిలో పెట్టుకొనే దీనినింతగా వర్ణించటం వ్యాసమహర్షి. అంతేగాని దీనిమీద తాత్పర్యం లేదాయనకు. తాత్పర్యం Intention or Aim మహర్షికి పారమార్ధికమైన మోక్ష పురుషార్ధం మీదనే. ధర్మపురుషార్ధం మీద కాదు. కేవలం దాని కుపకారకమిది అని చెప్పటమే ఆయన హృదయం. ఇదే మీరు భగవద్గీత 18 అధ్యాయాలలోనూ తెలుసుకోవలసిన పరమ రహస్యం. ఎక్కడికక్కడ వ్యావహారికం. ఎక్కడికక్కడ పారమార్ధికం. ఒకటి సంకేతం. మరొకటి సత్యం. కలలో మరచి పోగూడదు గీత శ్రవణం చేసే ప్రతి సాధకుడూ. మరిస్తే గీతా తాత్పర్యమే వాడికి బోధపడలేదని అర్ధం.
Page 520