సాంఖ్య యోగము
భగవద్గీత
మూలంగా కనిపించే శరీరం పోయినా కనిపించని శరీరంతో వాడు బ్రతుకుతూనే ఉంటాడని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. లోకులు నమ్ముతూ ఉన్నారు. వీరే జీవాత్మ వాదులు. ఇందులో దేహాత్మ దృష్టి అర్ధకామాల వరకు పరిమితమైతే - జీవాత్మ భావం ధర్మపురుషార్ధంతో ఆగిపోతున్నది. వీరిద్దరికీ ఆత్మ దృష్టి లేదు. అసలైన ఆత్మ ఏదో తెలియదు.
అసలైన ఆత్మ ప్రత్యగాత్మ. అది ఇటు దేహమూ కాదు. అటు ఈ దేహంలోనే కర్తగా భోక్తగా ఉన్నాడనుకొనే జీవుడూ కాదు. మరి ఎవడు భౌతికమైన శరీరమూ గాక మనః ప్రాణరూపంగా చలించే సూక్ష్మ శరీరమూ గాక – వీటి రెండింటినీ సాక్షిగా గమనించే శుద్ధ చైతన్యం. అది ఇప్పుడూ ఉంది మనలో. ఈ కనిపించే స్థూల శరీరమెలా చూస్తున్నామో దీనిలో నేనీ పనిచేస్తున్నాను - కష్ట సుఖాలను భవిస్తున్నా ననే సూక్ష శరీరమెలా భావిస్తున్నామో - అలాగే వీటి వ్యవహారా న్నంతా గమనిస్తున్న సాక్షిని కూడా నేనే గదా అనే భావన కూడా ఉంది మనకు. ఇదే ప్రత్యగాత్మ. ఇది స్థూలమూ కాదు సూక్ష్మమూ కాదు. రెంటినీ గమనిస్తున్నది గనుక కాదది. అలాగే గమనించే జ్ఞానం గనుక అది అజ్ఞాన రూపమైన కారణ శరీరమూ కాదు. శరీర త్రయాన్ని దాటి పోయిన అశరీరమైన కేవల జ్ఞానం. పరిశుద్ధమైన జ్ఞానం పరిశుద్ధ మెప్పుడయిందో పరిపూర్ణం నిరాకారం సర్వవ్యాపకం త్రివిధ శరీరాలలోనే గాక వాటి వెలపల కూడా ఉండగలదు కాబట్టి దానికిక మరణం లేదు. లోకాంతర జన్మాంతరాలు లేవు. పరమార్ధ స్వరూపేణ నిత్యత్వా తన్నారు భాష్యకారులు.
Page 51