#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  పోతే ఇక లాభమే గాక ఏ దుఃఖమూ లేదని చెప్పి దుఃఖాన్ని కూడా త్రోసి పుచ్చుతున్నది గీత. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తాపత్రయ మన్నారు సంసారాన్ని వర్ణిస్తూ వేదాంతులు. ఆధ్యాత్మిక ఆధి భౌతిక ఆధి దైవికాలని మూడు తాపాలతో తపించి పోతున్నారు జీవులు. తాపమంటే దుఃఖమే. ఎంత దుఃఖం ముంచుకు వచ్చినా యోగారూఢుడైన వాడు చలించడు. చలిస్తే వాడు ఆరూఢుడే కాడు. ఎప్పుడలా చలించబోడు. ఆత్మ తత్త్వే స్థితః అన్నారు ఆచార్యులవారు. ఆత్మ తత్త్వంలో పాదుకొన్నప్పుడే. ఆత్మకు చలనం లేదు గదా. అది అచలం. కనుక దానితో ఏకమైపోయిన యోగి బుద్ధి కూడా అచలమే. అచలం గనుకనే న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పెద్ద పెద్ద కఱ్ఱలూ కత్తులూ నెత్తిన బడ్డా ఈషన్మాత్రం చలించడు యోగి. యోగి చలించడని కాదు. ఎవడలా చలించడో వాడు యోగి అని అర్ధం చేసుకోవాలి మనం.

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా || 23 ||

  యత్రో పరమతే అనే శ్లోకం మొదలుకొని యం లబ్ధ్వా అనే శ్లోకం వరకూ ఈ మూడు శ్లోకాలలో ఏయే లక్షణాలుంటాయని ఆత్మావస్థాన విశేషమైన యోగాన్ని వర్ణించారో ఆ యోగ మెలాంటిదని మన మర్ధం చేసుకోవాలో ఇప్పుడు సంగ్రహంగా బయటపెడుతున్నది గీత. అలాంటి లక్షణాలుంటేనే వాడు యోగి లేదా యోగి అయిన వాడి కలాటి

Page 495

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు