#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

నామీదనే దృష్టి వాడికి. నేనే పరాయణం. మరే లోకమూ లేదు. అందుకే మచ్చిత్తః మత్పరః అని రెండు మాటలూ ప్రయోగించిందట గీత. ద్విర్బద్ధం సుబద్ధం భవతి అని ఒక మాట ఉన్నది. రెండు మార్లు దిమ్మిసా చేస్తే బాగా గట్టి పడుతుందంటారు. అలాగే రెండూ కలిపి చెబితే ఇక వాడి కదే తప్ప మరే దృష్టి లేదని మనకు బాగా బోధపడు తుందంటారు. భగవత్పాదులు. యుక్త ఆసీత. ఇంతకూ అలా నిశ్చలంగా ఏకాగ్రంగా మనసు పెట్టుకొని ధ్యానం చేయాలి యోగి. ఇదీ తాత్పర్యం.

ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః |
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14 ||

  అంతా అయిన తరువాత ఇప్పుడు యోగఫలమేదో అది వర్ణిస్తున్నది గీత. ఫలసిద్ధి అయ్యే వరకూ అభ్యాసం. అభ్యాసమేదో మొదటి నుంచీ వర్ణిస్తూనే వచ్చాడు. ఆసన మనీ దేహధారణ మనీ ఇంద్రియ నిగ్రహమనీ - మనస్సమాధానమనీ - ఇవన్నీ అభ్యాసం క్రిందికే వస్తాయి. అందులో కూడా మనసు నిశ్చలంగా నిలపటం ప్రధానం. మిగతా దేహ ధారణాదులన్నీ దానికంగాలు. పోతే సాంగో పాంగంగా జరిగిన ఈ సాధన కంతటికీ ఫలితమేమిటని ప్రశ్న వచ్చింది. దానికి సమాధాన మిస్తున్నదీ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియత మానసః ప్రతిక్షణమూ నియమం తప్పకుండా ఇలా యోగాభ్యాసం చేస్తూ మనసును కూడా ఒకే లక్ష్యం మీద నిలిపి దాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు యోగి. మరి దాని వల్ల అతడు సాధించే ఫలమేమిటి.

Page 479

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు