ఆత్మసంయమ యోగము
భగవద్గీత
అలాటి అనర్థం తొలగిపోవాలంటే నిరాడంబరంగా బ్రతక గలిగి ఉండాలి. అది ఎలాగంటే చెబుతున్నాడు. బ్రహ్మచారి వ్రతే స్థితః – బ్రహ్మచారి కుండే వ్రతమేదో అది పాటించాలి. గురు శుశ్రూష - భిక్షాటనంతో కడుపు నింపుకోటం - ఇలాటి జీవిత విధానం అనుసరించాలి. అప్పుడు బాహ్య చింత చాలావరకు తగ్గిపోతుంది. కాని ఇది ప్రతిలోమమే. అనులోమంగా చేయవలసిన పని ఒకటున్నది. మన స్సంయమ్య మనసులోని వృత్తులన్నిటినీ ఉపసంహరించుకోవలసి ఉంటుంది. అలా చిత్తవృత్తు లుప శమించాలంటే మచ్చిత్తః నామీదనే నీ మనస్సు నిలపమంటాడు పరమాత్మ. సమష్టి చింతన పెట్టుకొంటేనే వ్యష్టి తాలూకు ఆలోచన లుపశమిస్తాయి. యుక్త ఆసీత మత్పరః అని కూడా ఒక నియమం చెబుతున్నాడు. మచ్చిత్తః అన్నాడు గదా మళ్లీ మత్పరః అని చెప్పటం దేనికి.
దాని అర్ధం వివరిస్తున్నారు భాష్యకారులు. అహంపరో యస్య సోయం మత్పరో భవతి. పరమాత్మే ఎవడికి పరాయణమో. వాడు మత్పరుడు. పరమాత్మ తప్ప మరో లోకం లేనివాడని అర్ధం ఎందుకంటే కశ్చి ద్రాగీస్త్రీ చిత్తః నతు స్త్రీయ మేవ పరత్వేన గృష్ణతి. ఒక కాముకుడుంటాడు లోకంలో. వాడు స్త్రీ చిత్తుడైతే కావచ్చు గాని స్త్రీనే తన సర్వస్వంగా భావించక పోవచ్చు. మరేది భావిస్తాడు. ఒక రాజుగారినో ఒక దేవతనో కూడా అలాగే గొప్పగా భావించినా భావిస్తాడు. ఇక్కడ వీడలా కాదు. అయం తు మచ్చిత్తః మత్పరః
Page 478