#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

వారూ చూస్తుంటారు వీణ్ణి. వీడితో రకరకాలుగా వ్యవహరిస్తుంటారు. దాన్ని బట్టి వీడూ వాళ్లతో అలాగే వ్యవహరించవలసి వస్తుంది. అయినా అది వ్యావహారికం వరకే గాని పరమార్ధంలో తేడా ఏమాత్రమూ లేదనే భావన ఎప్పుడూ ఉండాలి వాడికి. అప్పుడు పైకి లోక వ్యవహారాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తుండాలి. లోపల మనసులో ఇదంతా పరమాత్మే కదా అస్తి భాతి కన్నా వేరే ఏముంది అని సామాన్య భావన ఏమరకుండా అవలంబించి ఉండాలి. అప్పుడే వాడు యోగారూఢుడు. ఏదో ఒకటి పట్టుకొంటే కాదు. ఆత్మ దృష్టి వదిలేసి అనాత్మను పట్టుకొన్నా వైషమ్యం చూడక తప్పదు. అనాత్మ నసలే పట్టించుకోక ఆత్మ చైతన్యంతో ఉన్నా వ్యవహారం సాగదు. అద్వైత దృష్టితో వ్యవహారం సాగిస్తున్నప్పుడే వైషమ్యం కనిపించదు నీకు. దృష్టిని బట్టి గదా సృష్టి - యధా మతి స్తధా గతిః అని లోకంలో కూడా ఉన్న నానుడి. అంచేత వ్యవహారంలో వైషమ్యమున్నా అది ఆ భాసే గనుక ఇబ్బంది లేదు.

  ఏమిటా వ్యవహారంలో మనకు కనిపించే వైషమ్యమంటే చెబుతున్నది గీత. సుహృత్ మంచి మనసున్న వాడు. ప్రత్యుపకారం కోరకుండా మనకు మేలు చేసేవాడు. మిత్ర - స్నేహ భావం చూపే వాడు. అరి శత్రుత్వం సాధించేవాడు. ఉదాసీన ఎవరి పక్షం వైపూ మొగ్గు చూపక తప్పించుకొనే వాడు. మధ్యస్థ - అలా తప్పించుకోకుండా ఇరువురి హితాన్నీ కోరేవాడు. ఉదాసీనుడికీ మధ్యస్థుడికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది

Page 468

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు