ఆత్మసంయమ యోగము
భగవద్గీత
పరమాత్మవే నీవు. దూరంగా ఎక్కడో లేడు పరమాత్మ. సమాహితః నీలోనే చేరిపోతాడు. చేరిపోతాడంటే ఎలాగా. సాక్షాదాత్మ భావేన వర్తతే నీ ఆత్మ స్వరూపంగానే నీ అనుభవానికి వస్తాడని వివరిస్తున్నారు భాష్యకారులు.
అంతేకాదు. ప్రత్యగాత్మే పరమాత్మ - పరమాత్మే ప్రత్యగాత్మ అని ఏకాత్మ భావాన్ని ఎప్పుడు గుర్తించావో అప్పుడిక నీకు సంసార భయం లేదు. ద్వంద్వాత్మకమే గదా సంసారమంటే. ద్వంద్వాలంటే ఏమిటవి. శీతోష్ట సుఖదుఃఖేషు - తధా మానాప మానయోః - శీతోష్టాలూ - సుఖదుః ఖాలూ మానావమానాలూ - ఇలాంటివి. ఇవన్నీ రాగద్వేషాలనే ఒకే ఒక ద్వంద్వం తాల్చిన వివిధావతారాలు, రాగద్వేషాలనేవి నీ ఆత్మ కన్యంగా ఏదో ఉందని భావించినప్పుడే ఏర్పడుతాయి. పరమాత్మ స్థితిని నీ ఆత్మ అందుకొని తాను పరమాత్మగానే అయిపోయి నప్పుడిక అన్యమే ముంది నీకు. అన్యం లేకుంటే రాగద్వేషాలనే ద్వంద్వమెక్కడిది. దాని సంతానమైన శీతోష్ణాది మిగతా ద్వంద్వా లెక్కడివి. అవేవీ లేకపోతే తన్నిమిత్తంగా నీమీద నిత్యమూ దాడి చేసే సంసార తాపత్రయ మెక్కడిది. అంతా ఒక్క దెబ్బతో పటాపంచెలయి పోతుంది. కనుక భయం లేదు.
జజ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః || 8 ||
కాబట్టి ఇక ఈ భయ మాభయం పెట్టుకోనక్కర లేదెప్పుడూ సాధకుడు. అతడు చేయవలసిన సాధన అంతా ఒక్కటే. పరమాత్మ సాయుజ్య
Page 464