ఆత్మసంయమ యోగము
భగవద్గీత
పడుతున్నారని కాదు నీవు భావించ వలసింది. అదంతా నీ భ్రాంతి. వాస్తవంలో నీకు బాహ్యంగా లేరెవ్వరూ. బంధు దృష్టి శత్రు దృష్టితో చూస్తేనే ఈ తేడా అంతా. ఆత్మ దృష్టితో చూస్తే బాహ్యంగా ఎవరూ లేరు. ఎక్కడా కనపడరు నీకు. దృష్టి తెచ్చిపెట్టినదే ఈ భేదం. ఆ దృష్టి నీవు పెట్టుకొన్నదే. పెట్టుకోకుంటే నీకు నీవే మిగిలిపోతావు. నీకు నీవే అన్నప్పుడిక శత్రువేమిటి మిత్రుడేమిటి.
అంచేత నీ కల్పనే ఇదంతా నీ భావనే. దానికి కారణం నీ మనసూ ఇంద్రియాలూ నీ వశంలో లేకపోవటమే. కనుకనే జితాత్మనః ప్రశాంతస్య. దేహేంద్రియాదులను మొదట నీ అదుపులో పెట్టుకోటానికి ప్రయత్నించు. ప్రయత్నించి అందులో నీవు నెగ్గావంటే ప్రశాంత మవుతుంది నీ అంతరింద్రియమైన మనస్సు. మనసు నిర్మల మవుతుందని అర్ధం. మలం పోతే నిర్మలం. మలమంటే మాలిన్యం. ఏదో గాదది విషయేంద్రియ సంపర్కమే. అది నీ వాత్మాభిముఖంగా తిప్పటమే వాటిని జయించటం. అప్పుడు నీవు జితాత్ముడవు ప్రశాంతుడవు. జ్ఞానేంద్రియాలను జయిస్తావు. మనసునూ జయిస్తావు. జ్ఞానేంద్రియా లప్పుడు మనోభిముఖమైతే మనస్సు ఆత్మాభిముఖ మవుతుంది. రెండూ శుద్ధి చెందాయి కాబట్టి దేహాత్మ కాదది. ఇంద్రియాత్మ కాదు. బుద్ధ్యాత్మ కూడా గాదు. మరేమిటి. ప్రత్యగాత్మ. కేవల చిన్మాత్ర స్వరూపమది. సాక్షిరూపమైన జ్ఞానం. అలాంటి ప్రత్యగాత్మే నా స్వరూపమని భావించావంటే చాలు. పరమాత్మా సమాహితః
Page 463