విషాద యోగము
భగవద్గీత
పదార్ధ జ్ఞాన మందిస్తాయి మనకు. కాగా మూడవ షట్కం 'అసి' అనే వాక్యార్ధ జ్ఞానమిస్తుంది. అంతవరకూ పరోక్షమే. పోతే ఇక అపరోక్ష రూపమైన అవాక్యార్ధ జ్ఞానమెక్కడ ఉంది గీతలో. అర్జునుడి చివరి చివరి మాటలలో ఉందని అర్ధం చేసుకోవాలి మనం. ఏమిటది. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదా న్మ యాచ్యుత. మహాత్మా నాకు నీవు ఎలాంటి జ్ఞానాన్ని ప్రసాదించావంటే దాని మూలంగా నా అజ్ఞాన మనేది పూర్తిగా తొలగి పోయింది. సర్వమూ ఆత్మస్వరూపమే మరేదీ లేదనే స్మృతి కూడా ఏర్పడింది అని హామీ ఇస్తాడు. అంటే పరోక్షంగా తాను శ్రవణం చేసిన వాక్యార్ధ జ్ఞానాన్ని అపరోక్షంగా అనుభవానికి తెచ్చుకొని మాటాడుతున్నా డర్జునుడు.
అర్జునుడు నిజంగా తెచ్చుకొన్నాడో లేదో గాని అసలు స్వానుభవానికి తెచ్చుకొన్నవాడి మాట ఇలాగే ఉంటుంది. తద్ధాస్యవిజ జ్ఞావితి - విజజ్ఞావితి అని ఉంది ఛాందోగ్యంలో. శ్వేత కేతువు జ్ఞానమే కాదు విజ్ఞానం కూడా సంపాదించాడట. జ్ఞానమంటే శాస్త్ర జన్యం. విజ్ఞానమంటే అనుభవ జన్యం. జ్ఞాన విజ్ఞానాలు రెండూ వేరు చేసి భగవద్గీతే చెబుతున్నది మనకు. జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యామి అని భగవానుడి మాట. భగవత్పాదు లలాగే వేరుగా చూపుతూ వాటిని వ్యాఖ్యానించారు. ఇలాటి విజ్ఞానమే అవాక్యార్ధం. అది అర్జునుడి కుందో
Page 45