విషాద యోగము
భగవద్గీత
పదార్ధ జ్ఞానమైతే - ఆత్మ దృష్టితో చూడటం వాక్యార్ధ జ్ఞానమైతే - అంతా అఖండమైన ఆత్మ స్వరూపంగా అనుభవానికి రావటం అవాక్యార్ధ జ్ఞానం పదార్ధాలంటే జీవ పదార్థం - ఈశ్వర పదార్థం. అవి వాచ్యార్ధం కావచ్చు. లక్ష్యార్ధం కావచ్చు. నామరూపాదులైన ఉపాధులతో కూడిన చైతన్యం వాచ్యార్ధం. అవి లేనిది లక్ష్యార్థం. కనుక భాగత్యాగ లక్షణ చెప్పుకోమన్నారు శాస్త్రజ్ఞులు. అంటే ఉపాధులను త్యజించి చైతన్యాన్ని మాత్రం భజించమని భావం. దీని కే లక్ష్యార్ధమని పేరు. దీనితో తత్త్వం పదార్ధాలు రెండూ శుద్ధి అవుతాయి. అయితే అవి శుద్ధమైన చైతన్య రూపాలే గనుక రెండు కావు ఒకటే ననే ప్రతిపత్తి కలుగుతుంది సాధకుడికి. దీనికే వాక్యార్ధమని పేరు. పోతే ఆ ఏకత్వాన్ని పరోక్షంగా ఎక్కడో ఉందని చూడక అది నేనే నా స్వరూపమేనని అపరోక్షంగా దర్శించటమే అవాక్యార్ధం. దీనితో సమాప్తం తత్త్వమపి విచారణ.
ఇది ఛాందోగ్య బోధ అయితే ఇదే బోధ ఇప్పుడు భగవద్గీత కూడా సాగిస్తున్నది. అది ఎలాగంటే భగవద్గీతను దీనిని బట్టి మూడు షట్కాలుగా విభజించారు పెద్దలు. 18 అధ్యాయాలు గదా భగవద్గీతలో ఉన్నది. అందులో మొదటి ఆరూ ఒక షట్కం మూడవ ఆరూ ఒక షట్కం. మొదటి రెండవ ఆరూ ఒక షట్కం పోతే షట్కం త్వం పదార్ధ శోధన అయితే - రెండవది తత్పదార్థ శోధన అయితే రెండు షట్కాలూ కలిసి
Page 44