కర్మసన్యాస యోగము
భగవద్గీత
పెట్టుకొనే వాడేదీ నమ్మడు. చూచినా నమ్మడు. చూడకున్నా నమ్మడు. చూడనిది కాదంటాడు. చూచింది అది కాదులే పొమ్మంటాడు. కాని వాస్తవ మేమంటే వాడు నమ్మినా నమ్మకపోయినా ఉన్నారు లోకంలో అలాంటి మహనుభావులు. అప్పుడూఉన్నా రిప్పుడూ ఉన్నారు. అయితే వారిని నీవు పోల్చుకోలేవు. కారణం నీవు వారి స్థాయి కెదిగి చూడలేవు. స్థాయి కెదగటమంటే వారి లక్షణా లెలాంటివో వాటి అవగాహన అంతకంతకూ అలవరుచుకోటం. ఎలా ఉంటాయి వారి లక్షణాలంటే వర్ణిస్తున్నది గీత.
ఋషయః క్షీణ కల్మషాః- ఋషులు వారు. ఋషి అంటే గడ్డాలు మీసాలు పెంచుకొని కళ్లు మూసుకొని గుహల్లో కూచొని ధ్యానం చేసేవారు గారు. సమ్యగ్దర్శినః - ఉన్న దున్నట్టు దర్శించేవారు. అన్నిటికీ అధిష్ఠాన Basis మేదో దాన్నే గమనిస్తున్నవారు. అలాంటి ఆత్మతత్త్వమే చూస్తున్నా రంటే వారికిక ఏ కల్మషమూ లేదు. ఏ దోషమూ లేదని అర్ధం. దోషమంటే వైషమ్యదృష్టి. అంతా సమంగా చూస్తున్న వాడికి వైషమ్య మేముందని. వైషమ్య మెప్పుడు లేదో ఛిన్న ద్వైధాః. ఇక సందేహమే లేదు వారికి. నిశ్చయ జ్ఞానంతో ఉంటారు. అంతేకాదు - మనోనిశ్చయ మేర్పడిందంటే యతాత్మానః ఇంద్రియాలు వారినిటూ అటూలాగే ప్రశ్న ఉండబోదు. అంతేకాదు. సర్వభూతహితే రతాః - సర్వమూ ఆత్మగానే చూస్తుంటారు కాబట్టి ఏ ప్రాణిని చూచినా దాని హితమే కోరుతారు. అహితం చేయాలని లవలేశ మనిపించదు. వైషమ్యదృష్టితో చూస్తేనే వీడు మనవాడు పరాయివాడ
Page 433