కర్మసన్యాస యోగము
భగవద్గీత
అందుకే ఎప్పటికప్పుడు మారుతుంటుంది. నీ బుద్ధి మారుతుంటే అదీ మారుతుంటుంది. బుద్ధి ఎందుకు మారటం. దాన్ని నడిపే దొకటున్నప్పు డది మారక ఏ మవుతుంది. ఏమిటా నడిపేదంటే అవిద్య అన్నారు భాష్యకారులు. బాహ్యవిషయాలకూ అదే కారణం. వాటితో సంబంధం పెట్టుకొన్న ఇంద్రియ వర్గానికే అదే మూలం. దానివల్ల తయారైనవే ఈ రెండూ. అవిద్యాకృత మంటారాయన ఇవి రెండూ. అందుకే ఆద్యంతవంతః - ఆదీ అంతమూ ఉంది వీటికి. పుట్టక ముందు లేవివి. పోతే అసలే కనపడవు. మన ఇంద్రియాలూ ఇంతే,మనం చూచే శబ్దాదులూ ఇంతే.ఏవ అనటాన్ని బట్టి ఇహంలోనే కాదు పరంలో కూడా వీటి బ్రతుకింతేనని చాటుతున్నారు భగవత్పాదులు. అంతేకాదు. ఆదీ అంత ముంటుంది వీటికంటే ఇంకొక అర్థం కూడా చెబుతారాయన. ఇంద్రియాలకు విషయాలతో సంబంధ మేర్పడితే అది ఆది. వాటితో సంబంధం తెగిపోతే అది అంతం. తన్నిమిత్తంగా దానివల్ల కలిగే అనుభవం కూడా తెగిపోతున్నది గనుకనే ఆద్యంతాలు రెండూ తప్పంటారు. అంటే మధ్యకాలంలోనే వాటిక స్తిత్వం.
ఇలాంటి క్షణ భంగురమైన సుఖాల వెంటబడి పోతున్నారంటే అత్యంత మూఢానామేవ విషయే షు రతిః యధాపశు ప్రభృతీనా మని చీవాట్లు పెడుతున్నారు గురువుగారు. ఎందుకిలా విషయాల వెంటపడిపోతు న్నారంటే అసలైన వస్తువేదో దాని జ్ఞానం లేక. అదే అవిద్య. అజ్ఞానం. పోతే వస్తువేదో దాన్ని గుర్తించిన వాడు జ్ఞాని. నతేషు రమతే బుధః - జ్ఞాని
Page 426