కర్మసన్యాస యోగము
భగవద్గీత
ఉంటాడు. మరి ప్రపంచం మాటేమిటి. అది విషమంగదా. నిజమే. ఎంత విషమమైనా బ్రహ్మాని కది తన శక్తిగా భాసిస్తే - వీడి కది కేవల మాభాసగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఎవరూ వస్తువని భావించరు కాబట్టి ఎవరికీ లేదీ ప్రపంచం. ఉన్నదల్లా అలా చూడలేని లౌకికుడికే.
న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః || 20 ||
ఇంతకూ బ్రహ్మ జ్ఞాని అయిన వాడుపాధు లన్నింటిలో సమానంగా పరుచుకొన్న బ్రహ్మాన్నే దర్శిస్తూ శరీరాదులైన ఉపాధులన్నీ ఆ భాసగా చూస్తాడు కాబట్టి వాడికిక ఏ బాధా లేదు. ఉన్న బ్రహ్మం తన స్వరూపమే కాబట్టి దాని వల్ల బాధలేదు. ఆభాస వస్తువేకాదు కాబట్టి దానివల్లా లేదు. మంచీ చెడ్డా సుఖం దుఃఖ మనే ద్వంద్వాలేవీ వాణ్ణి బాధించవు. ద్వంద్వాలే గదా విషమం. సమమైన బ్రహ్మాన్నే చూస్తున్నవాడికి విషమమనే భావమెక్కడిది. విషమం లేకపోతే సుఖదుఃఖాలనే ద్వంద్వాలసలే లేవు వాడి దృష్టిలో అదే చెబుతున్న దిప్పుడు గీత న ప్రహృష్యే త్రియం ప్రాప్య - నో ద్విజే త్రాప్య చాప్రియ మ్మని. లోకులందరూ తమ కిష్టమైనది లభిస్తే ఆనందిస్తారు. కష్టమైనది ప్రాప్తిస్తే కంగారు పడతారు. కారణం. వారు విషమంగా చూస్తుంటారు రెండిటినీ. కాని వీడలా చూడటం లేదు గనుక అనుకూలమైన దానికి మురిసిపోడు. ప్రతికూలమైతే బెడిసిపోడు. పోడని కాదు.అలా పోకుంటేనే వాడు జ్ఞాని. రెండింటిలోనూ సమమైన బ్రహ్మతత్త్వాన్నే దర్శిస్తాడు కాబట్టి మోద విషాదాలనే ప్రసక్తి లేదు జ్ఞానికి.
Page 421