#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


చూచే జ్ఞాని వస్తువైన బ్రహ్మాన్నీ బ్రహ్మమనే చూస్తాడు. దాని ఆభాస అయిన ప్రపంచాన్నీ బ్రహ్మంగానే చూస్తాడు. చూస్తాడే గాని వ్యవహరించడు. ఎందుకంటే ఆభాసలు వ్యావహారికంగా కనిపిస్తుంటాయి. వాటిలో వైషమ్యం కూడా వ్యావహారికంగా ఉంటూనే ఉంటుంది. కనుక సమదర్శినః అంటున్నాడు వ్యాసమహర్షి సమవర్తినః అనటంలేదు. లోకులందరూ జ్ఞానులు కారు. కాబట్టి వారికెప్పుడూ కనిపిస్తుంటుంది వైషమ్యం. వాడు బ్రాహ్మణుడూ చదువుకొన్న వాడూ - వీడు చండాలుడూ పరమ పామరుడూ అనే తేడా కొట్ట వచ్చినట్టు కనపిస్తుంది. మరి గోవూ గజము శునకమూ అయితే చెప్పనక్కరలేదు.

  పోతే అది కూడా సమదృష్టితో చూస్తున్నా జ్ఞాని ప్రారబ్ధవశాత్తూ లోక దృష్టి ననుసరించ వలసివస్తుంది గనుక వ్యవహారంలో అలా నడుచుకోరాదు. సాంకర్య మేర్పడుతుంది. కనుకనే చెబుతున్నాడు మహర్షి యేషాం సామ్యేస్థితం మనః అని. మనసు మాత్రమే సామ్యావస్థలో నిలిచి ఉండాలి జ్ఞానికి. మనసంతా బ్రహ్మకారమయి పోవాలి. అలా అయిపోతే ఎలా చూచినా ఎలా ప్రవర్తించినా అది బ్రహ్మమే వాడి దృష్టికి అలాంటప్పుడిక వాడీ సృష్టిని జయించాడనే అనుకోవచ్చు. ఇహైవ తైర్జిత స్సర్గః - సర్గః అంటే సృష్టి. ఇహైవ అంటే ఇక్కడే. జీవించి ఉండగానే సృష్టి రహస్యాన్ని ఛేదించి పట్టుకొన్నాడు వాడు. సృష్టి అంటే వైషమ్యం. అది చూడటం లేదు జ్ఞాని. బ్రహ్మాకారంగా భావిస్తున్నాడు. కనుక జయించాడనే అర్థం. దాటి పోడన్నమాట. వైషమ్యం లేనిదే గదా బ్రహ్మం వీడి దృష్టి కూడా అలాంటిదే అయింది గదా. అంచేత వీడూ బ్రహ్మంలోనే ఉంటాడు. బ్రహ్మం గానే

Page 420

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు