#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


అధిష్ఠానం Basis మీదనే చూపు పెట్టటం. అప్పుడా రోపితమైన నామరూపాది పదార్థాలన్నీ తద్రూపంగానే దర్శనమిస్తాయి.

  ప్రస్తుత మీ న్యాయాన్ని బట్టి చూస్తే బ్రాహ్మణడు మొదలు చండాలుడి వరకూ వారిలో సచ్చిత్తులే Existance and Awareness కనిపిస్తుంటాయి పండితుడి దృష్టికి. వారి శరరాదులు కనిపించవు. విశేషాలన్నీ సామాన్య దృష్టితో చూచినప్పుడు సామాన్య రూపంగానే దర్శనమిస్తాయి. తరంగ బుద్బుదాది విశేషాలు విశేషదృష్టితో గాక జలమనే సామాన్య దృష్టితో చూస్తే జలం గాక మరేమిటి. అలాగే ఆత్మ దృష్టితో చూస్తే అనాత్మ ప్రపంచమెక్కడ ఉంది. అంతా ఆత్మే అయితే అలా చూడగలిగి ఉండాలి. వాడే జ్ఞాని అలాంటి జ్ఞాని అన్నింటిలో సమత్వాన్నే చూస్తాడు. అన్నింటినీ సమంగా చూస్తాడని కాదు అన్నింటిలో సమాన్ని చూస్తాడని అర్థం.

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తే స్థితాః || 19 ||

  లో అన్నారు గా అన్నారు. రెంటికీ ఏమిటి తేడా. సమం బ్రహ్మ. అది వస్తువు. అసలున్న పదార్థం. విషమంగా కనిపించే పదార్థాలన్నింటిలో ఉన్నదది. బ్రాహ్మాణుడి దగ్గరి నుంచీ చండాలుడి వరకూ అన్ని ఉపాధులనూ వ్యాపించి ఉంది. కాని చిత్ర మేమంటే అదే ఆయా ఉపాధుల రూపంలో విషమంగా భాసిస్తున్నది. అది వస్తువైతే ఇది ఆభాస. ఆభాసలో ఉంది తేడా వస్తువులో లేదు. ఈ తేడా యే దోషం. ఇలాంటి దోషం సమంగా వ్యాపించిన బ్రహ్మంలో లేదు. కాబట్టి అది నిర్దోషం. అంచేత వస్తు దృష్టితో

Page 419

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు