విషాద యోగము
భగవద్గీత
కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వా ధర్మ సమ్మూఢ చేతాః విషాదంతో కుంగిపోతున్నాను. బావగారూ అందుకే దీనికి పరిష్కారమేమిటా అని మిమ్ములను ప్రశ్నిస్తున్నాను. యచేయః స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్తేహం శాధి మా త్వాం ప్రపన్నమ్. మీకు నేను మఱదిని గానిప్పుడు శిష్య పరమాణువును ఏది నాకు హితమో నాకు తెలియదు. తెలియక ప్రేయస్సే శ్రేయ స్సని భ్రమపడవచ్చు. మీరా శ్రేయస్సేదో చెప్పి నా భ్రాంతిని పోగొట్టం డని ప్రాధేయపడ్డాడు. నేను శిషుణ్ణి అని ఎప్పుడన్నాడో అప్పుడు శాసించి చెప్పవలసిన బాధ్యత గురువుకుంది. అలాగే చెప్పాడు సమాధానం యముడు నచికేతుడికి. ఈ నచికేతుడికీ కాల స్వరూపుడైన ఈ కృష్ణుడనే యముడు కూడా బోధించాడు.
ఏమిటా సమాధానం. మనం ముందే చెప్పుకొన్నామొక మాట. అనువాదం విధానమని. లోకానుభవంలో ఉన్న సమస్య ఏదో దాన్ని అనువదించి శాస్త్రం దానికి శాస్త్రీయమైన మార్గంలో పరిష్కారం చూపాలి. సమస్య ఏమిటో తెలిపిందిప్పుడు. మరణం. దానికి పరిష్కారమేదోగాదు అమృతత్వం మోక్షం. మోక్ష సన్న్యాస యోగంలో పేర్కొన్న మోక్షం. అది అందుకొనే విధానం సన్న్యాసం. ఇది సరిగా కఠోపనిషత్తు బోధించిన బాణీలోనే బోధిస్తున్నది గీత. ముంజా దిషీకా మివ ధైర్యేణ - నీ స్వరూపాన్ని నీవు ఈ ఉపాధిలో నుంచి వేరు చేసుకొని చూడాలి. ఎక్కడ ఉందని
Page 41