#


Index

విషాద యోగము భగవద్గీత

ఆయన తరఫున శుకుడు బోధించినా ఫలితమిచ్చింది పరీక్షిత్తుకు. సద్గురువు స్థాయి ఒక్కటే అయినా గ్రహించే శిష్యుల అధికార తారతమ్యాన్ని బట్టే అది ఒంట బడుతుందనటాని కింత కన్నా నిదర్శన మేముంది. ఇంతకూ జగద్గురువే మనకు గురువు కానక్కరలేదు. తత్స దృశుడైన ఏ సద్గురువైనా గురువే మనకు గ్రహించే తాహత్తుండా లేగాని. అందుకే తద్విద్ధి ప్రణిపాతేన - పరిప్రశ్నేన సేవయా అని శిష్యుడి కొక మూడు షరతులు పెట్టింది భగవద్గీత. కాని అవి కూడా సరిపోవు. అవి ఆషాఢభూతి లాంటి వాళ్లు కూడా ప్రదర్శించవచ్చు. అలాంటి పైపై తళుకులు కాదు. మాకు కావలసిందంటూ మళ్లీ ఒక మూడు విధించింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః - బాహిరమైన లక్షణాలు కావు. ఆంతరికమైన శ్రద్ధాతాత్పర్యాదు లుండాలి శిష్యునికి. అప్పుడే జ్ఞానం లబ్ధ్వా. ఆత్మజ్ఞానం వాడికి లభిస్తుంది. అంతవరకూ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం వారేమో ఉపదేశిస్తూనే ఉంటారు. నీకు మాత్రమది గగన కుసుమం.

  అయితే ఒకటి. ఎంత యోగ్యత ఉన్న శిష్యుడైనా అడిగి తెలుసుకోవాలి విషయం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. నా పృష్టః కస్యచి ద్బూయా తని శాస్త్రం కూడా ఘోషిస్తున్నది. అలా అడగాలంటే సమస్యను గుర్తించినవాడే అడుగుతాడు. నచికేతునికి పట్టుకొన్న సమస్యే అర్జునుడికీ పట్టుకొన్న దిక్కడ. అదే మరణ సమస్య. విషాదం దాని మూలాన్నే. అలాంటి సమస్యతో మధన పడుతూనే అడిగా డర్జునుడు.

Page 40

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు