#


Index

విషాద యోగము భగవద్గీత

పెద్దలు. ఆచార్యవాన్ పురుషో వేద అని ఛాందోగ్యం వర్ణిస్తున్నది. శాస్త్రాచార్యోపదేశ జనిత జ్ఞానదీప ప్రకాశేన అని తరుచుగా బోధిస్తారు. భాష్యకారులు.

  అయితే ఎవరలాటి సద్గురువులు. కృష్ణభగవానుడా కావచ్చు. కృష్ణం వందే జగద్గురు మన్నారు. జగత్తు కంతా గురువయి నప్పుడు మనకు కాకుండా పోతాడా. కాని కృష్ణావ తారం కాదిక్కడ జగద్గురువంటే. కృష్ణ పరమాత్మ అవతారం ద్వాపరయుగానికే పరిమితం. అర్జునుడి లాంటి వారికే ఉపయోగపడ్డాడా అవతార పురుషుడు. పోతే పరమాత్మ స్వరూపంగా ఆయన ఎప్పుడూ ఉన్నాడు. అప్పుడూ ఇప్పుడూ ఉన్నాడు. అయితే పలకడు భాషించడు. పలకటానికీ చేయటానికీ అది కృష్ణుడిలాగా మూర్తం కాదు. అమూర్తం. అమూర్తం మూర్తీ భవిస్తే గాని మన కుపయోగ పడడు. మూర్తి దాని కుపాధి. అది ఎప్పటికప్పుడు ధరించగలడు. వదిలేయగలడా పరమాత్మ. అలా ధరించే మూర్తులే గురుమూర్తులు. గురువనే ఉపాధిలో చేరి కనిపించే బ్రహ్మ స్వరూపులే వారు. గురు స్సాక్షా త్పరం బ్రహ్మ అన్నమాటకిదే అంతరార్థం. ఇలాంటి సద్గురువు లైతే మనకే కాలంలోనైనా లభిస్తారు. లభిస్తారని చెప్పటానికి తార్కాణ కృష్ణుడు నిర్యాణమై పోయినా అపర కృష్ణుడొక శుక మహర్షి వచ్చి పరీక్షిత్తుకు తత్త్వోపదేశం చేయటమే. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను పదేశిస్తే శుకుడు భాగవతమే బోధించాడు గదా పరీక్షిత్తుకు. మరి కృష్ణుడు బోధించినా పని చేయలే దది అర్జునుడికి.

Page 39

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు