#


Index

విషాద యోగము భగవద్గీత

మటంలాగా. అమూర్తమైన ఆకాశంలాంటి దాత్మ. చిదాకాశం సర్వవ్యాపకం. అందుకే సర్వభూతాశయ స్థితః అని వర్ణించాడు. అలాటి వ్యాపకమైన చైతన్యమే ఇక్కడ మామేకమనే మాట కర్ధం. అలాంటి ఆత్మతత్త్వాన్ని భజించినప్పుడే దానిమీద ఆరోపితమైన ఈ నామరూపాలనే అనాత్మ ధర్మాలన్నీ వదలిపోతాయి. పోతే అహం త్వా సర్వపాపే భ్యో మోక్షయిష్యామి. ఈ నామరూపాలనే సమస్త పాపాల నుంచి మోక్షమనేది లభిస్తుంది మానవుడికి. ఇదీ మోక్ష సన్న్యాస యోగం చివరకు చేసిన పరిష్కారం.

  ఇంతకూ విషాదం ద్వారా సమస్య ఏమిటో బయట పెట్టింది గీతాశాస్త్రం. మోక్ష సన్న్యాసం ద్వారా దానికి పరిష్కారం సెలవిచ్చింది. ఇప్పుడీ సమస్య దగ్గరి నుంచి ఆ పరిష్కారం వరకూ మన చూపు ప్రసరిస్తే మధ్యలో ఒక పెద్ద వంతెన కనపడుతుంది. గోదావరి లాంటి ఒక పెద్దనది దాటాలంటే ఇద్దరి నుంచి అద్దరికి వెళ్లాలి. రెండు దరులనూ కలిపే ఒక వంతెన ఉండాలి. ఇక్కడ విషాద యోగ మిద్దరి అనుకొంటే మోక్ష సన్న్యాస మద్దరి. పోతే ఇక వంతెన ఏమిటి. మధ్యలో ఉన్న 16 అధ్యాయాలూ అలాటి ఒక పెద్ద వంతెనే అనుకోవచ్చు. కానీ ఈ వంతెన మీది నుంచి మన మొంటరిగా నడచి పోగలమా మనలో ప్రతి ఒక్కరికీ అలాంటి ధైర్య మున్నదా. అందరమూ ఉత్తమాధికారులం కాదు గదా. అంటే శాస్త్రమే కాక మార్గదర్శకుడైన సద్గురువు కూడా అవసర మన్నారు

Page 38

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు